వచ్చే సంక్రాంతికి సినిమాల పోటీ తీవ్రం కానుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ సినిమాలు అల్లు అర్జున్ సినిమ అల.. వైకుంఠపురంలో ఒకటైతే.. మహేశ్ హీరోగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా రెండోది. ముఖ్యంగా అల్లు అర్జున్ అల.. వైకుంఠపురం సినిమా ప్రమోషన్లను ఇప్పటి నుంచే చేస్తే సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచుకుంటూ పోయాడు. మహేశ్ సరిలేరు.. టీమ్ బన్నీతో ఏమాత్రం పోటీ పడలేక పోయింది. ఇప్పటికీ ఏమాత్రం బజ్ క్రియేట్ చేయని సరిలేరు.. బన్నీకి డిసెంబర్ 1న మంచి షాక్ ఇవ్వబోతోందని తెలుస్తోంది.

 


మహేశ్ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఓ మాస్ పాట ఉంది. ఈ పాటను వచ్చే డిసెంబర్ 1న రిలీజ్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ పాట అదిరిపోయిందని నిర్మాత అనిల్ సుంకర తన ట్విట్టర్ లో రాసుకున్నాడు. ‘సామజవరగమన.., రాములో రాములా..’ పాటలతో బన్నీ ఇప్పటికే సంచలనాలు సృష్టించాడు. దీంతో అప్రమత్తమైన మహేశ్ సరిలేరు.. ఈ పాటను రిలీజ్ చేసి బజ్ క్రియేట్ చేయాలని భావిస్తోంది. సరిలేరు టీమ్ రిలీజ్ చేసిన మహేశ్ స్టిల్ ఏమాత్రం హైప్ క్రియేట్ చేయలేకపోయింది. చివరికి దర్శకుడు అనిల్ రిలీజ్ చేసిన చిన్న కామెడీ పంచ్ కూడా సరిలేరు.. పై ప్రేక్షకుల్లో ఏమాత్రం బజ్ క్రియేట్ చేయలేకపోయింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఈ మాస్ పాటపై ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ఈ పాటలో మహేశ్ తో తమన్నా ఆడిపాడబోతోంది.

 


ఈ రెండు సినిమా పుంజులు సంక్రాంతికి తలపడతాయనుకుంటే రెండు నెలల ముందు నుంచే నువ్వా – నేనా అన్నట్టు కొట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రిలీజ్ విషయంలో ఇద్దరూ జనవరి 12నే విడుదల తేదీ అనౌన్స్ చేయటం మంచి రసవత్తర పోరుకు తెరలేపింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: