టాలీవుడ్ లో ఈ మద్య కొత్త హీరోయిన్లు తమ అందచందాలతో అందరి మనసు దోచుకుంటున్నారు.  తన అందమైన మత్తు కళ్లతో ఎలాంటి వారినైనా ఇట్టే తన బుట్టలో పడేసే ముద్దు గుమ్మ..చక్కని కనుముక్కుతీరు.. ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకున్న నటి అనూ ఇమ్మాన్యుయేల్.  నేచురల్ స్టార్ నాని నటించిన ‘మజ్ను’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.  మొదటి సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ అమ్మడికి వరుసగా ఛాన్సులు వస్తాయని భావించింది.. కానీ అలా జరగలేదు. తెలుగు లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా ఈ ముద్దుగుమ్మకు ఏదీ కలిసి రాలేదు. 


ఈ మద్య  రాజ్ తరుణ్ హీరోగా 'కిట్టు వున్నాడు జాగ్రత్త' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మనసు దోచినా..ఈ ముద్దుగుమ్మ దర్శక, నిర్మాతల దృష్టి మాత్రం ఆకర్షించలేక పోయింది.  అదే సమయంలో త్రివిక్రమ్ - పవన్ కళ్యాన్ కాంబినేష్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ కెరీర్ పరంగా ఆదుకుంటుందనుకున్నా..ఈ మూవీ దారుణమైన డిజాస్టర్ అయ్యింది.  బన్నీ 'నా పేరు సూర్య' వంటి పెద్ద సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. కానీ ఈ మూవీ కూడా కమర్షియల్ హిట్ కాలేదు.  అయితే అనూ ఇమ్మాన్యుయేల్ అందమున్న సరైన మూవీస్ మాత్రం పడలేదు. దాంతో సహజంగానే అవకాశాలు ముఖం చాటేశాయి.

అను ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు రియలైజ్ అయిందట. గత సినిమాలు కేవలం స్టార్ హీరోలను మాత్రమే చూశానని..కథల విషయంలో శ్రద్ద పెట్టకపోవడం వల్ల తన కు ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయని తన సన్నిహితుల వద్ద వాపోయిందట. మళ్లీ తెలుగు నుంచి అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉందనీ, ఈ సారి కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుని, తానేమిటనేది నిరూపిస్తాననే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోందట. ఇప్పటికైనా కథల విషయంలో ఈ హాట్ బ్యూటీ జాగ్రత్తలు తీసుకొని సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: