స్టైలిష్ స్టార్
అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం "అల వైకుంఠపురములో". వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం ఇది. ఇప్పటికే వచ్చిన జులాయి. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు బాక్సాఫీసు వద్ద
బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అదీ గాక ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటోందట.
త్రివిక్రమ్ సినిమాలని ఫ్యామిలీ
ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడతారన్న విషయం తెలిసిందే.
అయితే
సినిమా ప్రమోషన్లలో చిత్ర బృందం చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. చిత్ర మోషన్
పోస్టర్ రిలీజ్ నుండి ఇప్పటి వరకు విపరీతమైన ఫాలోయింగ్ ని తెచ్చుకుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ’సామజవరగమనా" అనే పాట
యూట్యూబ్ లో సంచలనం క్రియేట్ చేసింది. అత్యధిక లైక్స్ సాధించిన తెలుగు పాటగా రికార్డు సృష్టించింది. అదీ గాక మొన్న రిలీజైన మాస్ బీట్ "రాములో రాములా" అనే సాంగ్ కూడా విపరీతంగా ట్రెండ్ అయింది.
ఈ రెండు పాటలు చిత్రానికి చాలా హైప్ తీసుకొచ్చాయి. అయితే బన్నీ కి మళయాళంలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకానొక సారి బన్నీ తెలుగు వాళ్ళకి
అల్లు అర్జున్ ని మళయాలీకి మల్లు
అర్జున్ ని అని వాళ్లలో ఒకడిగా కలిసిపోయాడు.
ఆర్య సినిమా మొదలుకొని బన్నీ సినిమాలన్నీ మళయాలంలో అనువాదం అవుతుంటాయి.
అల వైకుంఠపురములో చిత్రాన్ని కూడా మళయాల ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మళయాలీల కోసం ఈ చిత్ర మళయాలీ
పోస్టర్ ని ఈ రోజు విడుదల చేయనున్నారట.మరి తెలుగులో వలే మలయాళంలో కూడా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ విడుదల చేస్తారేమో చూడాలి. బన్నీ సరసన
హీరోయిన్ గా
పూజా హెగ్డే నటిస్తున్న ఈమూవీలో టబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది
జనవరి 12న
సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.