కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల శంకర్ దర్శకత్వంలో నటించిన 2.0, అలానే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించిన పేట సినిమాల వరుస విజయాలతో ఎన్నడూ లేనంతగా మంచి జోష్ మీదున్నారు. ఇక ప్రస్తుతం రజిని మాస్ మరియు కమర్షియల్ సినిమాల దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజిని నటిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, మరొక హీరోయిన్ నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. 

ఇప్పటికే పేటలో రజినీకి మంచి మాస్ బీట్ సాంగ్స్ ని అందించిన యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్, ఈ సినిమాకు కూడా సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన రజినీకాంత్ మాస్ పోలీస్ ఆఫీసర్ లుక్స్ కు ఆయన ఫ్యాన్స్ నుండి విపరీతమైన అప్లాజ్ రావడం జరిగింది. ఇకపోతే నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, మోలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, తెలుగు, తమిళ్

హిందీ, మలయాళం భాషల్లో ఈ సినిమా మోషన్ పోస్టర్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక మహేష్ బాబు ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా, 'పోస్టర్ అదిరిపోయింది, రజిని గారికి మరియు మురుగదాస్ గారికి ఈ సినిమా మంచి కావాలని అభినందనలు' తెల్పుతూ ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఇకపోతే కాసేపటి క్రితం రిలీజ్ అయిన ఈ మోషన్ పోస్టర్ లో రజిని మాస్ స్టయిల్లో ఫైట్ చేస్తూ అదరగొట్టారు. ఇక ఈ మోషన్ పోస్టర్ ను రజిని ఫ్యాన్స్ విపరీతంగా షేర్స్, లైక్స్ తో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో దీనిని వైరల్ చేస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రాబోయే జనవరి లో రిలీజ్ చేయనున్నారు.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: