టాలీవుడ్, మాలీవుడ్ లో సంచలన నటి పేరు తెచ్చుకున్ననటి అమలా పాల్. తెలుగులో నటించిన సినిమాలు కొన్ని మాత్రమే..కానీ ఈ అమ్మడి పాపులారిటీ మాత్రం ఓ రేంజ్ లో కొనసాగింది. తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ మద్య ప్రముఖ దర్శకుడు ఏ.ఎల్. విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ మూడేళ్ల కాపురం చేసిన తర్వాత ఇద్దరి మనస్పర్ధలు రావడంతో 2017లో వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పట్లో ఈ టాపిక్ పెద్ద సెన్సేషన్ గా మారింది. విడాకులు తీసుకున్న తర్వాత అమలాపాల్ పూర్తిగా సినిమాకే తన టైమ్ కేటాయిస్తుంది.
ఈ నేపథ్యంలో ఆ మద్య రత్న కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆడై’ మూవీలో కొన్ని సన్నివేశాల్లో పూర్తి నగ్నంగా నటించింది సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొంత మంది దారుణంగా విమర్శిస్తే..మరికొంత మంది సహజత్వమైన నటన అంటూ పొగిడేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బొర్లా పడింది. ఈ మూవీ తెలుగులో 'ఆమె' టైటిల్ తో రిలీజ్ అయ్యింది. దీని గురించి అమలా పాల్ మాట్లాడుతూ.. సినిమా కథ డిమాండ్ చేయడంతోనే తాను ఇలా నగ్నంగా కనిపించానని చెప్పింది..అయితే అది స్కిన్ టైట్ డ్రెస్ అని ఆ డ్రెస్ తో నగ్నంగా ఉన్నట్లు కనిపిస్తారని తర్వాత సర్ధిచెప్పింది.
తాజాగా ఈ హాట్ బ్యూటీ మరోసారి ‘ఆమె’ తరహా సాహసాన్ని చేసి చూపించి నెట్టింట సెగలు రేపింది. తాజాగా ఈ భామ నగ్నంగా టబ్ బాత్ చేస్తున్న ఓ ఫొటోను నెట్టింట అప్లోడ్ చేసి కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. ప్రస్తుతం అమలాపాల్ ఇండోనేషియాలోని బాలిలో విహారయాత్రను ఆస్వాదిస్తోంది. ఓ హోటల్లో బస చేసిన ఈ అమ్మడు.. అక్కడి గదిలోనే ఓ సెలయేరు పక్కన బాత్ టబ్లో పూల మధ్య నగ్నంగా జలకాలాడుతూ దర్శనమిచ్చింది. తాజాగా ఈ ఫోటో షూట్ లో తన వీపుపై ఉన్న టటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రస్తుతం ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్తో పాటు ‘ఆడు జీవితం’, ‘కాడవర్’ అనే తమిళ సినిమాల్లో నటిస్తుంది.