జబర్దస్త్ కామెడీ గురించి తెలియని వాళ్లంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇందులోని హాస్య నటులంతా ఒక్కొక్కరు తమదైన శైలిలో ప్రేక్షకులను కుడుపుబ్బా నవ్వించి డైలీ జీవితంలో లోని బాధలని ఇట్టే మాయం చేస్తారు. అయితే మన జీవితంలోని బాధలను మాయం చేసే వీరి జీవితాలు మాత్రం చాలా విషాదకరంగా ఉంటాయి. ఒక్కసారి మీకు వాళ్ళ తెర బయటి జీవిత బాధల గురించి తెలిస్తే పసిపిల్లవాడి వల్లే ఉక్కపెట్టి ఏడవడం కాయం.


ఇపుడు మనం చెపుకోబోయే జబర్దస్త్ మాజీ నటి కూడా అలాంటి బాధలోనే ఉన్నారు. ఆ షో లో ఆడ వేషాలేసే ఈమె మొదట అబ్బాయి గా సాయి తేజగా ఉండేది. ఆపై ఆపరేషన్ ద్వారా పూర్తిగా అమ్మాయిగా మారిపోయింది. సాయి తేజ నుంచి ప్రియాంక గా మారిపోయిన ఈమె ట్రాన్సజెండెర్ ఆపరేషన్ తర్వాత ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. ఆర్థరైటిస్ కూడా రావడంతో చావు వారికి వెళ్ళొచ్చింది ఈ ప్రియాంక సింగ్.


తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక తన గురించి ఇంకా మరెన్నో విషయాలను షేర్ చేసుకుంది. అమ్మాయి గా మారిన తర్వాత తనపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయని బాధపడింది. తన ఫ్రెండ్ అయినా ఆడవేషాలేసే జబర్దస్త్ వినోద్ కి కూడా ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. ఇటీవల కాలంలో... నా సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేస్తావా అంటూ ఒక దర్శకుడు ఫోన్ చేసాడని... తాను చేస్తాననడంతో.. ఆ డైరెక్టర్ బాగా ఎక్సపోసింగ్ చేయాలి మరి అంటే దానికి కూడా ఒప్పుకున్నానని చెప్పింది.

అయితే ఆ డైరెక్టర్ వరంగల్ లో ఆ సాంగ్ షూటింగ్ ఉందని అక్కడికి రామన్నడంతో అన్ని సర్దుకొని వరంగల్ కి బయల్దేరేనని.. మార్గం మధ్యలో అదే డైరెక్టర్ ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడని తెలిపింది. ఆ డైరెక్టర్ తనని 3 రోజుల పాటు ఆయన... అతనితో పాటు ఉండే ఇంకో అతనితో కలిసి ఒకే రూమ్ లో ఉండాలన్నాడని.... దానికి ఆమె నేనెందుకు ఉంటాన్నని ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు తెలిపింది. ఆ డైరెక్టర్ గురించి ఇన్ని చెప్పిన ప్రియాంక అతను పేరు మాత్రం బయటపెట్టలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: