ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎలక్షన్స్ జరగక ముందు తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర రెండు భాగాలుగా తెరకెక్కించి పరాజయాలు చూసిన నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత 2019 ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం కార్యక్రమంలో పాల్గొని హిందూపురం నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి కొంతకాలం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఆ తర్వాత తాజాగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో రూల‌ర్ అనే సినిమా మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ఇటీవల దీపావళి పండుగనాడు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. సినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు పాస్టర్ బట్టి అర్థం అవుతుంది.


సి.క‌ల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో  బాలకృష్ణ హీరోగా నటిస్తుండగా సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అంతేకాకుండా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక వంటి వారు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదల చేయటానికి సిద్దమవుతున్నారు. ఇదిలా ఉండగా రూల‌ర్ సినిమా తర్వాత బాలకృష్ణ...బోయపాటి దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టనున్నట్లు సమాచారం. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా లెజెండ్ లాంటి సినిమాలు హాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రికార్డులు సృష్టించాయి.


ఇటువంటి నేపథ్యంలో తాజాగా వీరిద్దరి కలయికలో మూడో సినిమా రాబోతున్న క్రమంలో ఆ సినిమాపై బాలకృష్ణ అభిమానులు ఇప్పటినుండి అంచనాలు పెట్టుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్ట్ వార్త ఇండస్ట్రీలో బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ తో పాటు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అయితే విలన్ రోల్ లో సంజయ్ దత్ నటిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు కూడా బోయపాటి జరిగినట్లు అంతా ఓకే అయినట్లు ఫిలింనగర్లో వినబడుతున్న టాక్. 



మరింత సమాచారం తెలుసుకోండి: