నిన్న మొన్నటి వరకు ఈనెలలోనే చిరంజీవి..
కొరటాల సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వబోతుందని అందరు అనుకున్నారు. కాని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ
సినిమా ఇంకా డిలే అవుతుందని తెలుస్తోంది.
డిసెంబర్ రెండవ వారంలో ఈ
సినిమా షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారట. ఇప్పటికే
పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఈ
సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీటవలేదని.. దాంతో పాటు చిరంజీవికి కొన్ని కమిట్ మెంట్స్ ఉన్నందున షూటింగ్ మరోసారి వాయిదా వేశారని తెలుస్తోంది.
ఈ సినిమాలో
త్రిష ఒక
హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని సెకండ్
హీరోయిన్ గా తెలుగమ్మాయి
ఈషా రెబ్బను పరిశీలిస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
సినిమా సెట్స్ మీదకు వెళ్ళిన తర్వాత
హీరోయిన్స్, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు అఫిషియల్ గా వచ్చేస్తాయి. అందుకే
సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అంటూ మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ
సినిమా ఈనెలలో ప్రారంభం అవుతుందనుకుంటే ట్విస్ట్ ఇచ్చి వచ్చే నెలకు షిఫ్ట్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం మెగా ఫ్యాన్స్ ను కాస్త నిరుత్సాహ పరుస్తుంది. అయితే
సినిమా ఆలస్యంగా ప్రారంభం అయినప్పటికి దర్శకుడు
కొరటాల శివ ఈ సినిమాను వచ్చే ఉగాదికి విడుదల చేసేలా
ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.