టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ హిట్ జోడీ అంటే, తొలుత గుర్తుకు వచ్చేది విజయ్ దేవరకొండ, రష్మికా మందన అని అంటారు.  కన్నడ నాట కిర్రాక్ పార్టీ మూవీతో హీరోయిన్ గా అడుగు పెట్టిన రష్మిక తర్వాత తెలుగు లో నాగశౌర్య హీరోగా నటించిన ‘ఛలో’ సినిమాతో తెలుగు లోకి అడుగు పెట్టింది.   ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.  అంతే ఈ అమ్మడి అదృష్టం వరుసగా తెలుగు లో ఛాన్సులు దక్కించుకుంటూ వస్తుంది.


ఛలో తర్వాత పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా వచ్చిన ‘గీతా గోవిందం’ ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది.  దాంతో ఈ అమ్మడికి తెలుగు, తమిళ, కన్నడ లో వరుస ఛాన్సులు వచ్చాయి.  ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటిస్తుంది.  అయితే గీతాగోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్ లో ‘డీయర్ కామ్రెడ్’ మూవీ వచ్చింది.  ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్క్ ఔట్ అయినా..కమర్షియల్ హిట్ మాత్రం కాలేదు.  వరుసగా కలిసి నటించే జోడీపై రక రకాల రూమర్లు రావడం సహజం.  ఈ నేపథ్యంలో కొంత కాలంగా దేవరకొండ, రష్మిక మందన ఇద్దరూ లవ్ లో ఉన్నారని..రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే. 


తాజాగా, రష్మికను వ్యక్తిగతంగా కించపరిచేలా, విజయ్ తో అఫైర్ ఉందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరల్ అయింది.  ఈ పోస్ట్ పై రష్మిక మందన చాలా సీరియస్ అయ్యింది.  నటీ నటుల మీద ఇటువంటి విమర్శలు చేస్తే ఏమొస్తుందో తెలియడం లేదని మండిపడింది.  తాను పబ్లిక్ ఫిగర్ అయినంత మాత్రాన తమను డైరెక్ట్ గా టార్గెట్ చెయ్యొచ్చని కాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.


సాధారణంగా సెలబ్రెటీలపై నెగిటీవ్ కామెంట్స్ వస్తే సిల్లీగా తీసుకోవాలని తనకు చాలా మంది చెప్పారు..కానీ ప్రతి విషయాన్ని అలా తీసుకోలేము కదా అని వాపోయింది.  సదరు పోస్ట్ ను పెట్టిన వాళ్లకు కంగ్రాట్స్‌ చెబుతూ, తనను నొప్పించాలనుకున్న వారు విజయవంతం అయ్యారని ఎద్దేవా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: