తెలుగు సినిమానే కాకుండా సౌత్ మొత్తంలో స్టార్ స్టేటస్ పొందిన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. తొంభైల్లో అల్లుడుగారు సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారి ఓ దశాబ్దం పాటు దక్షిణాది పరిశ్రమను ఏలేసింది. కీలకమైన రోల్స్ ను పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయడంలో రమ్మకృష్ణ దిట్ట. ప్రస్తుతం ఆకాశ్ పూరి హీరోగా వస్తున్న సినిమాలో మందిరా బేడీ స్థానంలో రమ్యకృష్ణను తీసుకున్నారని టాక్.

 


మొదట్లో ఈ సినిమాలో కీలకమైన పాత్రకు మందిరా బేడీని తీసుకున్నారట మేకర్స్. ఆమె కొన్ని సీన్లను కూడా షూట్ చేశారట. అయితే రషెష్ చేసిన యూనిట్ కు మందిరా బేడీ వర్క్ అంతగా నచ్చలేదట. ఆలోచనలో పడ్డ టీమ్ రమ్యకృష్ణను సంప్రదించగా ఆమె ఓకే చేసిందని సమాచారం. మందిరపై షూట్ చేసిన సీన్లను ఇప్పుడు రమ్యతో రీషూట్ చేస్తున్నారట టీమ్. మందిరా బేడీ అంటే కొందరు ప్రేక్షకులకే తెలుసు కానీ.. అంతగా ఇంపాక్ట్ ఉండదు. రమ్యకృష్ణ అయితే చెప్పేదేముంది.. సినిమాకు ప్లస్ అవుతుంది.. జనాల్లోకి వెళుతుంది. దీంతోనే మందిరాను రీప్లేస్ చేసిందట యూనిట్. ఇటివల సాహోలో నటించిన మందిరా బేడీ ఎఫెక్ట్ చూపలేక పోయింది. దీంతో రొమాంటిక్ లో ఇంతటి కీలకమైన పాత్రకు బాలీవుడ్ కంటే టాలీవుడ్ నటులే  కరెక్ట్ అని భావించారట దర్శక నిర్మాతలు.

 


గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా నరసింహలో నీలాంబరి, బాహుబలిలో శివగామి పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసింది రమ్యకృష్ణ. పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో పూరి జగన్నాధ్ తన కొడుకును హీరోగా పెట్టి అనిల్ పాడూరి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా స్టిల్ ఆకట్టుకుంది. కేతిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ లో ఈ సినిమా విడుదలవుతుందని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: