సినీ నటుడు
విశాల్ కు తెలుగు,
తమిళ చిత్రాలలో మంచి ఆదరణ దక్కించుకున్నాడు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
విశాల్ గారు తెలుగు చిత్రాలలో కూడా చాలా మంచి పేరును దక్కించుకున్నాడు. తన మాతృభాష అయిన తెలుగులోకి ఆయన
తమిళ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా తమిళంలో దర్శకుడు
సుందర్ సి. రూపొందించిన 'యాక్షన్'
సినిమా విడుదలకి సిద్ధం అవుతుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.
ఈ తరుణంలో తెలుగు వెర్షన్ కి సంబంధించి,
హైదరాబాద్ లో ప్రీ రిలీజ్
ఈవెంట్ ను నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 9వ తేదీన ఇక్కడి 'దసపల్లా కన్వెన్షన్'లో ప్రీ రిలీజ్
ఈవెంట్ ను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియచేస్తూ, తాజాగా ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
విశాల్ సరసన నాయికగా
తమన్నా నటించగా, సీనియర్
హీరో రాంకీ ..
ఐశ్వర్య లక్ష్మి ..
ఛాయా సింగ్ .. కబీర్ దుల్హన్ సింగ్ .. యోగిబాబు ముఖ్యమైన పాత్రల్లో పోషిస్తున్నారు. 'అభిమన్యుడు'.. 'డిటెక్టివ్' చిత్రాల మాదిరిగానే, 'యాక్షన్'కి కూడా తెలుగు ప్రేక్షకుల ఆదరణ లభించడం ఖాయమనే నమ్మకంతో విశాల్ ముందుకు కొనసాగుతున్నాడు.
ఈ సినిమాకి ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్పై రవీంద్రన్ నిర్మాతగా చేస్తున్నారు.
సినిమా మొత్తం యాక్షన్ నేపథ్యంలో సాగుతుందని టీజర్ను బట్టి బాగా తెలుస్తుంది. ఇప్పటివరకు
విశాల్ కెరీర్లో ఇంతటి యాక్షన్ సన్నివేశాలతో కూడిన
సినిమా చేయలేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. తమన్నాకు కూడా కేవంల గ్లామర్ పరంగా కాకుండా కీలక పాత్రే ఇచ్చినట్లు సమాచారం.