నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా శతమానం భవతి ఫేం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా `ఎంత మంచివాడవురా. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి 15న రిలీజ్‌ చేస్తున్నట్టుగా తెలియచేసింది సినిమా యూనిట్.  ప్రతీ సంవత్సరంలాగే 2020లో సంక్రాంతి సీజన్‌ టాలీవుడ్‌కు రసవత్తరంగా మారుతుంది అనే చెప్పాలి. ఇద్దరు టాప్‌ స్టార్‌లు అల్లు అర్జున్‌, మహేష్ బాబులు ఈ సీజన్‌లో రంగంలోకి దిగబోతున్నారు. అధికారికంగా తెలిపిన విధానంగా ఈ ఇద్దరు స్టార్లు జనవరి 12న ఒకే రోజు బరిలో దిగుతున్నారు. అయితే ఓ బిగ్ ఫైట్‌ను తప్పించేందుకు ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు.


మహేష్ సరిలేరు నీకెవ్వరు, బన్నీ అల వైకుంఠపురములో సినిమాలో ఒకే రోజు రిలీజ్‌ అయితే థియేటర్ల సమస్యతో పాటు ఓపెనింగ్ కలెక్షన్ల మీద కూడా ప్రభావం చూపిస్తుంది అని అందరు భావనలో ఉన్నారు. అంతేకాదు ఈ సీజన్‌లో మరో సినిమా రిలీజ్ చేస్తే నామ మాత్రంగా కూడా థియేటర్లు దొరకటం లేదు అంటే నమ్మండి. 
అయితే ఇంత ఇబ్బంది పరిస్థితిలోనూ వెనక్కి తగ్గేది లేదంటున్నాడు నందమూరి అందగాడు కళ్యాణ్‌ రామ్‌.

ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో ఎంత మంచివాడవురా సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు రావడం జరిగింది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపట్టిన చిత్రయూనిట్ టీజర్‌ను కూడా రిలీజ్ చేయడం జరిగింది తాజాగా.


ప్రస్తుతానికి ఈ సినిమాపై పాజిటివ్‌ టాక్ ఐతే  ఉంది. సరైన సమయంలో రిలీజ్‌ అయితే సినిమాకు మంచి రికార్డు కచ్చితంగా వస్తుంది అని భావనలో ఉంది చిత్ర యూనిట్. బన్నీ, మహేష్ లాంటి టాప్‌ స్టార్స్‌ బరిలో ఉన్నా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా జనవరి 15న సినిమాను రిలీజ్ చిత్ర యూనిట్ తెలియ చేయడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: