వెంకీ కుడుములు దర్శకత్వంలో వచ్చిన ఛలో సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన రష్మిక మందన్న, తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు కుర్రకారుని తన అందంతో ముగ్ధుల్ని చేసింది అనే చెప్పాలి. ఇక ఆ తరువాత ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించిన గీత గోవిందం సినిమా మరింత గొప్ప విజయాన్ని అందుకుని, రష్మిక కెరీర్ కి మంచి బ్రేక్ ని అందించింది. ఆ తరువాత నాగార్జున మరియు నానిల కలయికలో వచ్చిన దేవదాస్ లో నటించినప్పటికీ ఆ సినిమా మాత్రం ఆశించిన రేంజ్ విజయాన్ని రష్మికకు అందివ్వలేదనే చెప్పాలి. 

అనంతరం ఇటీవల మరొక్కసారి విజయ్ సరసన ఆమె నటించిన డియర్ కామ్రేడ్ సినిమా యావరేజ్ విజయాన్ని అందించింది. ఇకపోతే ప్రస్తుతం ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోయే సినిమాతో పాటు నితిన్ సరసన భీష్మ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న ఈ భామ, ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధిస్తే, ఆమెకు మరింత గొప్ప ఇమేజి రావడం ఖాయం అనే చెప్పాలి. 

ఇకపోతే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, అతి త్వరలో విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ కలయికలో తెరకెక్కనున్న ఫైటర్ సినిమాలో ఆమెను హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా కథ తనకు ఎంతో నచ్చడంతో పాటు, విజయ్ తో తనకు మంచి అనుబంధం ఉండడంతో రష్మిక ఈ సినిమాలో నటించడానికి పచ్చ జండా ఊపిందట. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం రావలసి ఉంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: