తెలుగు వెండితెర తన అడ్డా అంటూ చెప్పిన ఈ జనరేషన్ లేడీ సూపర్ స్టార్. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మరోసారి వైభవం తెచ్చిన అరుంధతి. స్టార్ హీరోయిన్గా తారా స్థాయికి చేరినా ఇప్పటికీ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిశబ్ధంగా ఉండే నిగర్వి.. అందం, అభినయం కలగలసి స్వీటీ బర్త్ డే సందర్భంగా ఆమె కెరీర్పై ఓ స్పెషల్..
అనుష్క సౌత్ ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్గా చాలాకాలం పాటు చక్రం తిప్పింది. 35 ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ స్వీటీ క్రేజ్ తారా స్థాయిలోనే ఉంది. ఇటీవల సినిమాల ఎంపికల కాస్త స్లో అయిన ఈ
బ్యూటీ త్వరలో నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. 2005లో
నాగార్జున హీరోగా
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సాండల్వుడ్
బ్యూటీ అనుష్క. ఆ తర్వాత
సుమంత్ సరసన మహానందిలో నటించింది. ఈ రెండు సినిమాలు పెద్దగా క్రేజ్ తీసుకురాకపోయినా
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమార్కుడుతో స్టార్
హీరోయిన్ అయిపోయింది. ఇక ఆ తర్వాత 2009లో వచ్చిన అరుంధతితో
అనుష్క లేడీ సూపర్ స్టార్గా అవతరించింది. అప్పటి వరకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే పట్టించుకోని నిర్మాతలు ఒక్కసారిగా
అనుష్క డేట్ల కోసం ఎగబడ్డారు. విజయశాంతి తర్వాత తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మళ్లీ ఊపు తీసుకొచ్చిన
హీరోయిన్ అనుష్కే. అయితే తన ఇమేజ్ను ఒక జానర్కే పరిమితం చేసుకోవద్దన్న ఉద్దేశంతో అరుందతి తరువాత వెంటనే బిల్లా సినిమాతో బికినీ షోతో అలరించింది స్వీటీ.
ఆ తర్వాత పంచాక్షరి, రుద్రమదేవి, భాగమతి, సైజ్ జీరో లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది అనుష్క. మరోవైపు సింగం లాంటి సినిమాల్లో హీరోయిన్గానూ గ్లామర్ ఒలకబోసింది. ఇక
అనుష్క కెరీర్లో మరో భారీ చిత్రం బాహుబలి. ఈ సినిమాలో దేవసేన పాత్రలో నటించిన అనుష్క.. అందంతొ పాటు అభినయంతోనూ అభిమానులను కట్టిపడేసింది. అయితే
బాహుబలి షూటింగ్ జరుగుతుండగానే సైజ్ జీరో
సినిమా కోసం భారీగా బరువు పెరగటం
అనుష్క కెరీర్ను కష్టాల్లో పడేసింది. ఆ తరువాత ఒకటి రెండు సినిమాలో
అనుష్క లుక్పై విమర్శలు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ విమర్శలను తిప్పికొడుతూ మరోసారి స్వీటీ స్వీట్ లుక్లో అలరించేందుకు సిద్దమయ్యింది. తన విజయ నాథాన్ని నిశ్శబ్దం లోనే వినిపించేందుకు రెడీ అవుతోంది. నిన్న నిశ్శబ్దం చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్కు తిరిగి వచ్చిన స్వీటీని తమ అభిమానులు నవంబర్ 7
అనుష్క పుట్టినరోజు. 1981లో పుట్టిన ఈ భామ.. ఈ ఏడాదితో 38 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులు అమెతో ఎయిర్ పోర్ట్లోనే కేక్ కట్ చేయాలని కోరగా. అభిమానుల కోరికమేరకు ఆమె కేక్ కట్ చేసి అందుకు ఆమె వారికి తిరిగి కృతజ్ఞతలు కూడా తెలిపారు.
అనుష్క అందరితోనూ చాలా స్నేహంగా ఉంటుంది. తన దగ్గర పని చేసే వారికి కూడా చాలా ప్రత్యేకమైన విలువను కూడా ఇస్తుంది. ఈ సందర్భాన్ని బట్టి అభిమానులకు కూడా ఆమె ఎంత విలువిస్తుందనేది తెలుస్తుంది. అందుకే ఆమెకు ఎంతోమంది లోయలు ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు.