మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ తెరకెక్కించిన చిత్రం 'లూసిఫర్' యొక్క కాపీ రైట్స్ ను కొణిదెల ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వం లో తెలుగు మెగాస్టార్ చిరంజీవి లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించాలని కొణిదెల ప్రొడక్షన్ ఆలోచన లో ఉన్నారన్న సంగతీ తెలిసిందే.

అయితే బిజీ షెడ్యూల్ వల్ల ప్రస్తుతానికి ఈ సినిమా ను కొన్ని రోజులు పక్కన పెట్టనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా బిజీలో రామ్ చరణ్ అలాగే సైరా మూవీ చేసి విరామంలో చిరంజీవి అటు రాజకీయాలకు పరిమితమని ఇక సినిమాలు చేయనని పవన్ కళ్యాణ్ ఉండటం వలన ఈ సినిమా ఇప్పుడప్పుడే పట్టాలెక్కేలా కనిపించట్లేదు.
ఇప్పటికే సుకుమార్ అల్లు అర్జున్ తో ఒక సినిమాకు ముహూర్తపు క్లాప్ కొట్టేశాడు. పైగా సుకుమార్ కు ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదట.

బన్నీ తో మూవీ తర్వాత కూడా ఎన్టీఆర్ లేదా ప్రభాస్ తో సినిమా తీయాలనే ఆలోచన లో ఉన్నాడట కాబట్టి సుకుమార్రీమేక్ మూవీ కి పూర్తిగా దూరమైనట్లే. అంతేకాక చిరంజీవి కూడా కొరటాల తో మూవీని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక చిరుతో కలిసి నటిద్దాం అనుకున్న రామ్ చరణ్ కు జక్కన్న సంగతి తెలియనిది కాదు. రామ్ చరణ్ మూవీ ఈ ఏడాది కి కూడా పూర్తవుతుందో లేదో చెప్పలేం. కాబట్టి రామ్ చరణ్ లేకపోతే ప్రొడక్షన్ పనులు చూసుకోవడం కొణిదెల ప్రొడక్షన్స్ వారికి కష్టమవుతుంది.

ఇలా రోజులు గడిచిపోయి లూసిఫర్ కథ అటకెక్కిపోయి సినిమా తీయలేని పక్షంలో కాపి రైట్స్ కొన్న చిరంజీవి డబ్బులను బొక్కెట్టుకున్నట్లే అని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: