మహేష్ బాబు మరియు రష్మిక మందన్నల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వంటి సూపర్ హిట్ సినిమాలు తీసి, కెరీర్ పరంగా ఒక్క ఫెయిల్యూర్ కూడా లేని యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన పలు పోస్టర్స్ మరియు ఫస్ట్ లుక్ ఇంట్రో టీజర్, సినిమాపై అమాంతం అంచనాలు పెంచేయగా, మధ్యలో అక్కడక్కడా బయటకు వస్తున్న లీక్ ఫోటోలు కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 

ఇకపోతే నేడు కాసేపటి క్రితం సరిలేరు నీకెవ్వరు టీమ్ మొత్తం కలిసి ఎంతో సరదాగా దిగిన గ్రూప్ ఫోటోని సినిమా యూనిట్ కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేసింది. హీరో మహేష్, హీరోయిన్ రష్మిక, ప్రధాన పాత్రధారి విజయశాంతి, విలన్ గా నటిస్తున్న ప్రకాష్ రాజ్, నటి సంగీత, నటుడు రాజేంద్ర ప్రసాద్, రఘు బాబు సహా మరికొందరు సినిమాలోని నటీనటులతో పాటు దర్శకుడు అనిల్, నిర్మాత అనిల్ సుంకర, డీవోపీ రత్నవేలు ఈ గ్రూప్ ఫొటోలో దర్శనమిచ్చారు. 

ఇక ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోన్న ఈ ఫోటోపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ సహా సాధారణ ప్రేక్షకులు ఈ గ్రూప్ పిక్ చాలా బాగుందని, అయితే మాకు పోస్టర్లే కాదు పాటలు కూడా కావాలి అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: