సినిమా ఇండస్ట్రీ లక్కీ లాటరీ లాంటిది. ఇక్కడ ఎప్పటికప్పుడు హిట్స్ పడితేనే వెలుగుతుంటారు. లేకపోతే ఆ వెలుగు ఆరిపోతుంది. ఇలాంటి దశలోనే వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్.. ఈ సినిమా చేసే టైమ్‌కి ఆ టీమ్‌లో ఉన్న అందరికి కూడా హిట్ అనేది ఖచ్చితంగా పడితీరాలి. పూరి డైరెక్టర్‌గా నిలబడాలన్నా, ప్రొడ్యూసర్‌గా ఛార్మి కొనసాగాలన్నా, హీరోగా రామ్ తన మార్కెట్‌ని నిలబెట్టుకోవాలన్నా ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్ అవ్వాలి.


ఇలాంటి పరిస్దితుల్లో  టీమ్ అంతా కష్టపడి ఈ సినిమాని హిట్‌గా నిలపడమే కాకుండా ఇస్మార్ట్ శంకర్, రెవెన్యూ పరంగా కూడా రఫ్ ఆడించాడు . ఇక ఆ సినిమాలో నటించిన ఇద్దరు హీరొయిన్స్ నభా నటేష్, నిధి అగర్వాల్‌కి కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ మంచి అవకాశాలే సంపాదించి పెడుతుంది.. నిధి ఈ సినిమా విజయం తర్వాత రెండు యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాల్లో  అవకాశం వచ్చినప్పటికీ, మంచి కధ ఉన్న లవ్ స్టోరీనే చేయాలని  నిర్ణయించుకుని, ఆ రెండింటిని కాదనుకుంది.


ఆమె అనుకున్నట్లుగానే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా పరిచయం అవుతున్న చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. అంతేకాదు ఈ సినిమాలో నటించినందుకుగానూ ఆమె రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటుందో తెలుసా అక్షరాల కోటి 25 లక్షల అందుకుంటుందీ. ఎందుకనగా నిధి అగర్వాల్‌కు ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.


అందుకే మేకర్స్ కూడా ఆమె పారితోషికం విషయంలో అస్సలు ఆలోచించకుండా ఓకే చెప్పేశారట. ఇకపోతే ఇందులో ఓ సెంటిమెంట్ కూడా ఉందట. ఈ విశేషం ఏమిటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి చిత్రం ‘రాజకుమారుడు’లో బాలీవుడ్ బ్యూటీ ప్రీతీజింతా హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడదే సెంటిమెంట్ ఫాలో అవుతూ అశోక్ గల్లా చిత్రానికి కూడా బాలీవుడ్ భామ నిధి అగర్వాల్‌ను సెలక్ట్ చేశారు.


రెండు యాక్షన్ మూవీస్‌లో అవకాశం వచ్చినా వదులుకుని, మంచి ప్రేమకథ కోసం చూస్తున్న నిధి.. ఇటు స్టోరీపరంగానూ, అలాగే రెమ్యూనరేషన్ పరంగానూ తను కోరుకున్నది దక్కించుకున్నందుకు తెగ ఆనంద పడిపోతుందట. ఇప్పుడందరు అదృష్టమంటే ఈ అమ్మడిదే అని అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: