విభిన్నమైన కథలు ఎంచుకుంటూ
బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేస్తూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. శ్రీమంతుడు...
భరత్ అనే నేను...
మహర్షి లాంటి వరుస హిట్లతో దూసుకుపోతున్నారు
మహేష్ బాబు . ఇక
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో
మహేష్ బాబు సరసన అందాల ముద్దుగుమ్మ
రష్మిక మందన్న నటిస్తోంది. కాగా
మహేష్ బాబు సినీ కెరీర్ లోనే మొదటి సారి
ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.
మహేష్ బాబు కు తోడు భారీ తారగణం...దర్శకుడు
అనిల్ రావిపూడి టేకింగ్ ఇలా అన్ని అంశాలు సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చిన అది ఓ సంచలనం గా మారిపోతుంది. ఇప్పటికే ఈ
సినిమా నుంచి విడుదలైన
మహేష్ బాబు
విజయశాంతి ఫస్ట్ లుక్ లకి మంచి ఆదరణ లభించింది.
కాగా తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి చిత్ర బృందం మొత్తం గ్రూప్ ఫోటో తో సందడి చేసింది.
మహేష్ బాబు,
రష్మిక, ప్రకాష్ రాజు, విజయశాంతి, రఘుబాబు, దర్శకుడు
అనిల్ రావిపూడి ఇతర నటీనటులు టెక్నీషియన్స్ అంతా కొలువుదీరిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్
ఇండియా లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటో చూసిన
సూపర్ స్టార్ అభిమానులు అందరూ తెగ మురిసిపోతున్నారు. అయితే సరిలేరు నీకెవ్వరు
సినిమా షూటింగ్ కేరళలో చిత్రీకరించిన సందర్భంగా చిత్ర సభ్యులంతా ఒక చోట చేరి సందడి చేసారు. సరిలేరు నీకెవ్వరు
సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
సరిలేరు నీకెవ్వరు సినిమాలో
సూపర్ స్టార్ మహేష్ బాబు మేజర్
అజయ్ కృష్ణ పాత్రను పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా అలనాటి అగ్రతార డైనమిక్ నటి
విజయశాంతి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో సినిమాల్లో కి రీ ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 13 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి... తాజాగా
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. దీంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ
సినిమా కోసం అటు
మహేష్ బాబు అభిమానులే కాదు
విజయశాంతి అభిమానులు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు పదమూడేళ్ల తర్వాత తమ అభిమాన నటి
వెండి తెరపై కనిపించనుండడంతో విజయశాంతిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన
విజయశాంతి ఫస్ట్ లుక్ కూడా అందరినీ ఆకర్షించిన విషయం తెలిసిందే.