భరత్ అనే నేను, మహర్షి లాంటి  2 బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి దర్శకత్వం లో 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా మహేష్ బాబు చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై మహేష్ అభిమానులకు అంచనాలు బీభత్సంగా పెట్టుకున్నారు.


ముఖ్యంగా కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది అని ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటించడంతో ఈ సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వడంతో ఇండస్ట్రీలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా పై మంచి ఆకర్షణ నెలకొంది.ఇప్పటికే విజయశాంతి కి సంబంధించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో స్టిల్స్ సోషల్ మీడియాలో విడుదల వైరల్ అవుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కి సంబంధించిన ఒక కొత్త న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.


అదేమిటంటే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు పెద్దగా జరగడం లేదని సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల కు సంబంధించిన మిగతా సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలు గట్టిగా జరుగుతున్నాయని అభిమానుల నుండి సినిమా యూనిట్ పై ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో నవంబర్ మూడవ వారం నుండి కానీ నాలగవ వారం నుంచి కానీ “సరిలేరు నీకెవ్వరు” టీమ్ నుంచి రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తాయని ఇక నుంచి మహేష్ అభిమానులకు సినిమా విడుదల అయ్యేంత వరకు అనేక విషయాలు తెలియజేయడానికి సినిమా యూనిట్ రెడీ అవుతున్నట్లు సమాచారం. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమాతో మహేష్ హ్యాట్రిక్ హిట్ కొడతాడని.



మరింత సమాచారం తెలుసుకోండి: