సూపర్ స్టార్ రజనీకాంత్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా లో రజనీకాంత్ పక్కన హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. ఈ సినిమాలో రజినీకాంత్ పోలీసు పాత్రలో నటిస్తున్నట్లు సినిమా స్టిల్స్ ద్వారా తెలుస్తోంది. బొంబాయి ప్రాంతంలో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఎక్కువగా జరిగిన నేపథ్యంలో గ్యాంగ్ స్టార్ మరియు పవర్ ఫుల్ పోలీస్ మధ్య జరిగే కథ గా దర్బార్ సినిమా ఉండబోతున్న ట్లు తెలుస్తోంది. దీంతో సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు ముగిసిన నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవల మెల్లగా మొదలుపెట్టారు.


ఈ నేపథ్యంలో సినిమా నుండి రజినీకాంత్ కు సంబంధించి పలు లుక్స్ ను రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ కెరియర్ గురించి అనేక రూమర్స్ వస్తున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల తన గురువు కె.బాలచందర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్ మాట్లాడుతూ… తనకు కొందరు బీజేపీ రంగు వేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.


గతంలో ప్రముఖ తమిళ కవి తిరువళ్లువర్ విషయంలో కూడా భాజాపా ఇలానే చేసిందని, కానీ అది సాధ్యంకాలేదని, తాను కూడా వారి ట్రాప్లో పడనని అన్నారు. దీంతో ఇన్నాళ్ళుగా భాజాపాతో రజనీ కలుస్తారనే వార్తలకు చెక్ పడింది. అంతేకాదు అధికారికంగా రాజకీయాల్లోకి వెచ్చే వరకూ సినిమాలు చేస్తూనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. మరోపక్క రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు బట్టి సౌత్ ఇండియా కు చెందిన బీజేపీ పార్టీ నాయకులు కూడా ఇకనుండి రజినీకాంత్ పై ఎక్కువ దృష్టి పెట్టకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: