సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన
నిధి అగర్వాల్ ఆ
సినిమా ఫ్లాప్ అయినా మరో అక్కినేని
హీరో అఖిల్ తో మిస్టర్ మజ్ ను సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆ
సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక థర్డ్
మూవీ ఇస్మార్ట్ శంకర్ చేసింది
నిధి అగర్వాల్. రాం హీరోగా నటించిన ఈ సినిమాను
పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేశారు.
ఈ
సినిమా హిట్ అమ్మడికి సూపర్ క్రేజ్ తెచ్చింది. అంతేకాదు
నిధి రేంజ్ కూడా ఇస్మార్ట్ హిట్ వల్ల పెరిగింది. ప్రస్తుతం అమ్మడు కూడా సినిమాకు
కోటి రూపాయల రెమ్యునరేషన్ అడుగుతుందట. గల్ల జయదేవ్ కుమారుడు
మహేష్ మేనళ్లుడు
గల్లా అశోక్ హీరోగా వస్తున్న సినిమాకు
నిధి అగర్వాల్ ను
హీరోయిన్ గా ఎంపిక చేశారట.
ఈ
సినిమా కోసం
నిధి ఏకంగా
కోటి 25 లక్షల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. అమ్మడు డిమాండ్ కు నిర్మాతలు కూడా సై అన్నారట.
ఇస్మార్ట్ శంకర్ తో ప్రేక్షకుల్లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న
నిధి ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో
సక్సెస్ అవుతుంది. ఈ సినిమాను శ్రీరాం
ఆదిత్య డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది.
దేవదాస్ సినిమా తర్వాత శ్రీరాం
ఆదిత్య మరే
సినిమా చేయలేదు. మరి
మహేష్ మేనళ్లుడు
అశోక్ తెలుగు
సినిమా పరిశ్రమలో హీరోగా నిలబడగలుగుతాడా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. ఈ
సినిమా ఓపెనింగ్ నుండి రిలీజ్ అవరకు
సూపర్ స్టార్ మహేష్ సపోర్ట్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మేనళ్లుడు సినిమాకు తన వంతు సాయం చేయకపోతే అల్లుడుతో పాటుగా బావ ఫీల్ అవుతాడు కదా.