సరిలేరు నీకెవ్వరు కేరళ షూటింగ్ షెడ్యూల్ ఈ శుక్రవారం తో ముగిసింది. ఈ సందర్భంగా ఈ చిత్ర బృందం కలిసి తీసుకున్న ఓ గ్రూప్ ఫోటో ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ సామజిక మాధ్యమాలలో షేర్ చేసింది. ఈ గ్రూప్ ఫోటో ని గమనిస్తే అది కేరళలోని ఓ రైల్వే స్టేషన్ అని... ఇంకా అందులో మహేష్ తో సహా కథానాయిక రష్మిక, నటీనటులు ప్రకాశ్‌రాజ్‌, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్‌, రఘు బాబు, సంగీత తదితరులు ఉన్నారని తెలుస్తుంది. 


సినిమా నుంచి ఏ ఫోటో వచ్చినా అది సంచలనం అవ్వడం విశేషం. ఇటీవలే సరిలేరు నీకెవ్వరు షూటింగ్ నుంచి విడుదలైన రష్మిక మందన్న లంగాఓణిలో ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అయ్యిన విషయం తెలిసిందే. రెడ్ లంగాఓణిలో రష్మిక అచ్చం తెలుగమ్మాయిలా ఉందంటూ అభిమానులు సామజిక మాధ్యమాలలో తెగ కామెంట్స్ చేసారు. 


టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా టాకీ భాగం.. అంటే పాటల షూట్ మినహాయించి, మిగిలిన షూట్ మొత్తం పూర్తయిందని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం లో...తమన్నా తో ఓ ఐటమ్ సాంగ్ చేయబోతున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. చాలా కాలం తర్వాత విజయశాంతిసినిమా ద్వారా రీఎంట్రీ చేస్తున్నారు. 


వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా అంటే జనవరి 12న విడుదలయ్యే ఈ సినిమాని ముగ్గురు మహేష్ బాబు, అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి తెరపైకెక్కిస్తున్నారు. ఆర్మీ నేపథ్యంలో...అందాల తార రష్మిక తో...హాట్ తమన్నా ఐటమ్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరిలేరు నీకెవ్వరు ఎంతగా అలరిస్తుందో ఊహించవచ్చు. ఇంకా ఈ చిత్రంతో రష్మిక ఫేమ్ ఎక్కడికో వెళ్తుందని తన అభిమానులు చర్చించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: