సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కుతోంది. 2020 సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది. గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో సరిలేరు నీకెవ్వరు సినిమా గురించి నెగిటివ్ వార్తలు వస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు డైరెక్టర్ అనిల్ రావిపూడి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కు గొడవలు జరిగాయని కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. 
 
సరిలేరు నీకెవ్వరు సినిమా గురించి ఇలాంటి వార్తలు వస్తూ ఉండటంతో మహేష్ బాబు ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరోవైపు ఈ సినిమాకు పోటీగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న అల వైకుంఠపురములో సినిమా నుండి విడుదలైన పాటలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ రొటీన్ గా ఉంటోందనే  విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. 
 
అల వైకుంఠపురములో సినిమా పాటలు సినిమాపై భారీగా అంచనాలు పెంచుతూ ఉండటంతో సరిలేరు నీకెవ్వరు సినిమా పాటలు ఆ స్థాయిలో ఉంటాయా...? లేదా...? అని మహేష్ అభిమానులు కలవరపడుతున్నారు. నిర్మాత అనిల్ సుంకర్ దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు అద్భుతంగా ఉన్నాయని సోషల్ మీడియాలో చెబుతున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ పడుతూనే ఉన్నారని తెలుస్తోంది. 
 
సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ డిసెంబర్ నెల మొదటి వారం నుండి ప్రమోషన్స్ లో వేగం పెంచబోతుందని తెలుస్తోంది. అనిల్ రావిపూడి దేవిశ్రీ ప్రసాద్ మధ్య గొడవల గురించి వస్తున్న వార్తలపై వీరిద్దరూ స్పందించి స్పష్టత ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంథపురములో సినిమాలు జనవరి 12వ తేదీనే విడుదలవుతాయని మేకర్స్ ప్రకటించినా రిలీజ్ డేట్లు మారే అవకాశం ఉందని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: