కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన అంటే ఒక్క తమిళనాట మాత్రమే కాదు యావత్ భారత దేశంంలోనే కాదు..ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు. రజినీ నడిచినా, జుట్టు ఎగరేసినా, సిగరేట్ కాల్చినా, కళ్లజోడు స్టైల్ గా పెట్టడం ఒక్కటి కాదు స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఆయన్ని చూసి ఎంతో మంది యువహీరోలు అలాంటి స్టైల్ ఫాలో అయిన విషయం తెలిసిందే. అప్పట్లో రజినీ సిగరేట్ కాల్చి, చూయింగ్ గమ్ నోట్లో వేసుకోవడం చూసి ఎంతో మంది యువత ఫాలో అయ్యేవారు. అలాంటి సూపర్ స్టార్ కి ఆరు పదులు దాటినా ఇప్పటికీ యువ హీరోలతో పోటీ పడుతూ నటిస్తున్నారు.
ప్రస్తుతం సినీమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా తన మార్క్ చాటుకుంటున్నారు. సొంతగా పార్టి పెట్టిన ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో సరికొత్త పంథా తీసుకు వస్తానని అన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు చేస్తూనే రాజకీయ వ్యవహారాల్ని కూడా ఒక కంట కనిపెట్టే ఉంటున్నారు. గత కొన్నాళ్లుగా రజనీ తన తర్వాతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత బీజేపీ ఆదిపథ్యాన్ని చాటుకుంది. ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నికయ్యారు. ఈ మధ్య రజనీ భాజాపాకు చెందిన ముఖ్య నేతతో సమావేశం కావడం ఈ వార్తలకి మరింత బలాన్నిచ్చింది.
అయితే ఈ విషయంపై రజినీకాంత్ స్పందిస్తూ..తనకు రాజకీయల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంది..కానీ తనకు కాషాయ రంగు మాత్రం పూయవొద్దని అన్నారు. గతంలో ప్రముఖ తమిళ కవి తిరువళ్లువర్ విషయంలో కూడా భాజాపా ఇలానే చేసిందని, కానీ అది సాధ్యంకాలేదని, తాను కూడా వారి ట్రాప్లో పడనని అన్నారు. దీంతో ఇన్నాళ్ళుగా భాజాపాతో రజనీ కలుస్తారనే వార్తలకు చెక్ పడింది. అంతేకాదు అధికారికంగా రాజకీయాల్లోకి వెచ్చే వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చారు. రజనీ మాటలతో ఆయన అభిమానులకు అనేక విషయాలపై స్పష్టత వచ్చినట్టైంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘దర్భార్’ మూవీలో నటిస్తున్నారు రజినీకాంత్ . ఇది కాకుండా ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలుపెట్టే పనిలో ఉన్నారు రజనీ.