మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' సినిమా విజయంతో మంచి జోష్ మీద ఉన్నారు. దాదాపు రెండు సంవత్సరాల పాటు తన సమయాన్ని సైరా సినిమా టికెట్ అందించడంతో చిరంజీవి తన నెక్స్ట్ సినిమా కొరటాలతో చేయబోయే సినిమా తక్కువ టైంలోనే కంప్లీట్ చేసి వచ్చే సమ్మర్ కి మెగా అభిమానులకు అందించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇటువంటి తరుణంలో కొరటాలతో చేయబోయే సినిమా దసరా పండుగ నాడు పూజా కార్యక్రమాలు ప్రారంభించిన సినిమా యూనిట్ డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని కొరటాల చిరంజీవి భావించారు. అయితే సినిమాలో చిరంజీవి సినిమా సన్నగా స్లిమ్ గా కనిపించాలని భావించిన క్రమంలో ఇంకా బరువు తగ్గాల్సిన నేపథ్యంలో ఈ సినిమా జనవరి నుండి స్టార్ట్ చేయడానికి కొరటాల సిద్ధమైనట్లు సమాచారం.


ముఖ్యంగా సినిమాలో చిరంజీవి డబుల్ రోల్ పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో మొదటిగా స్లిమ్ గా చిరంజీవి కనిపించే పాత్ర ని కంప్లీట్ చేసి తర్వాత మరొక పాత్రని చిత్రీకరించాలని కొరటాల డిసైడ్ కావడంతో ప్రస్తుతం చిరంజీవి స్లిమ్ అవ్వడం కోసం జిమ్ లో స్పెషల్ ట్రైలర్ ఆధ్వర్యంలో కసరత్తులు చేస్తూ స్పెషల్ డైట్ పాటిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గురించి అనేక వార్తలు వస్తుండగా తాజాగా సినిమాకు ‘గోవింద హరి గోవింద’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలిసింది.


అయితే దీనిపైన ఇంకా ఎటువంటి అధికార ప్రకటన వెలువడలేదు. మరోపక్క ఈ సినిమాలో దేవాదాయశాఖ ఉద్యోగిగా చిరంజీవి క్యారెక్టర్ చేస్తున్నట్లు అందుకోసమే ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్లు దేవాదాయ భూముల విషయంలో జరిగే అవినీతిని బయటపెట్టే పాత్రలో చిరంజీవి నటిస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో చిరంజీవి డబుల్ రోల్ క్యారెక్టర్ చేస్తున్న నేపథ్యంలో ఇద్దరు హీరోయిన్లు కావస్తున్న క్రమంలో త్రిష మరియు జెనీలియా ని హీరోయిన్లుగా సినిమా యూనిట్ తీసుకున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: