కె.సి. బొకాడియా చలనచిత్ర రంగంలో పరిచయం అవసరంలేని పేరు. ఎంద‌రో  స్టార్‌హీరోలను, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి, ఫాస్ట్‌గా 50 సినిమాలు కంప్లిట్‌ చేసిన ఫిలిం మేకర్‌గా రికార్డ్‌ సాధించిన బాలీవుడ్‌ పాపులర్‌ ఫిలిం మేకర్‌. లేటెస్ట్‌గా లలిత్‌ మోడీ, గౌతమ్‌చంద్‌ రాథోర్‌ సమర్పణలో కె.సి.బొకాడియా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'నమస్తే నేస్తమా'. గతంలో ఆయన నిర్మాణంలో బ్లాక్‌బస్టర్‌హిట్‌ సాధించిన 'తేరి మెహర్భానియా' చిత్రానికి పార్ట్‌-2గా వస్తోన్నఈమూవీ ద్వారా తెలుగు పరిశ్రమకి పరిచయమవుతున్నారు కె.సి.బొకాడియా. ఈషాన్యామహేశ్వరి, నాజర్‌, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, చమక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో యువ న‌టుడు  శ్రీరామ్ గెస్ట్ అప్పీయ‌రెన్స్ ఇస్తున్నారు. రెండు కుక్క‌లు ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి బప్పిలహరి, చరణ్‌ అర్జున్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాపులర్‌ ఫిలిం మేకర్‌ కె.సి.బొకాడియా, చిత్ర సమర్పకులు గౌతమ్‌చంద్‌ రాథోర్‌, హీరోయిన్‌ ఈషాన్యా మహేశ్వరి, కో- ప్రొడ్యూసర్‌ ఎస్‌.ఆర్‌ చాప్లాట్‌, ఫైట్‌ మాస్టర్‌ బి.జె శ్రీధర్‌, రాజ్‌ కుమార్‌ బొకాడియా, నటుడు తాగుబోతు రమేష్‌ పాల్గొన్నారు..

పాపులర్‌ ఫిలిం మేకర్‌ కె.సి. బొకాడియా మాట్లాడుతూ - ''మాది రాజస్థాన్‌ లోని చిన్న గ్రామం, మా నాన్న గారు ఒక్కసినిమా కూడా చూడలేదు. అలాంటి ఒక ఫ్యామిలీ నుండి వచ్చి బొంబాయిలో ఉన్న హైకాంపిటేషన్‌ని తట్టుకొని 1972లో సంజీవ్‌ కుమార్‌తో 'రివాజ్‌' సినిమాను నిర్మించడం నేను ఎప్పటికి మర్చిపోలేను. ఆతరువాత 1985లో 'ప్యార్‌ జుక్తా నహి' విడుదలైన అన్ని భాషలలో సిల్వర్‌ జూబ్లీ చేసుకుంది. ఆ తర్వాత అదే సంవత్సరంలో మానాన్నగారు బి.ఎం. బొకాడియా పేరుమీద 'బి.ఎం.బి' ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసి నిర్మించిన 'తేరి మెహర్భానియా' సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఈ సినిమా కూడా దాదాపు అన్ని భాషలలో రీమేక్‌ అయింది. ఈ తరువాత మా ప్రొడక్షన్‌లో వచ్చిన సినిమాలు అన్ని  ఒకదాని తర్వాత ఒకటి సూపర్‌ హిట్స్‌ అయ్యాయి. ఆ తరువాత నా డైరెక్షన్‌లో అమితాబ్‌ హీరోగా 'ఆజ్‌ కాఅర్జున్‌' సినిమా వచ్చి గొప్ప విజయం సాధించింది. తరువాత అమితాబ్‌ గారితో చాలా సినిమాలకు వర్క్‌ చేయడం జరిగింది. ఏ డైరెక్టర్‌ దగ్గర వర్క్‌ చేయకుండానే మద్రాస్‌ డైరెక్టర్‌ మణివన్నన్‌ గారి దగ్గర అరగంట ట్రైనింగ్‌ తీసుకొని దర్శకత్వం వహించాను. ఆ తరువాత లతామంగేష్కర్‌ గారు నాకు చాలా సపోర్ట్‌ చేసి నా నిర్మాణంలో, దర్శకత్వంలో చాలా పాటలు పాడడం జరిగింది. నేను రజినీకాంత్‌ గారితో 5 సినిమాలకు వర్క్‌ చేయడం జరిగింది. అమితాబ్‌ బచ్చన్‌, రజినీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, అజయ్‌దేవగన్‌, సన్నీదేవన్‌, షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్ అలా 100కు పైగా పెద్దపెద్ద స్టార్స్‌తో వర్క్‌ చేయడం జరిగింది. ప్రియాంక చోప్రాని హీరోయిన్‌గా పరిచయం చేసింది నేనే. దీనంతటికి మీ మీడియా వారి ప్రోత్సాహమే కారణం. మీరు లేకుంటే నేను లేను. 'నమస్తే నేస్తమా' నా ఫస్ట్‌ తెలుగు మూవీ. అలాగే నాకు చాలా ఇష్టమైన మూవీ. 'తేరి మెహర్భానియాస‌ ఇన్స్‌పిరేషన్‌తో తీసిన ఈ మూవీ తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. రెండు డాగ్స్‌తో ఈ సినిమా తీయడం జరిగింది. మీ అందరికీ సుపరిచితుడు అయిన శ్రీరామ్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అలాగే బ్రహ్మనందం, నాజర్‌, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, తదితరులు నటించారు. ఈ సినిమా విజయం నాకు తెలుగులో మరిన్ని సినిమాలు నిర్మించడానికి ఉపయోగపడుతుంది.  మ‌నుషుల‌తో అయినా సినిమాలు తీస్తే ఫ్లాప్ అవొచ్చేమోగాని, జంతువుల‌తో తీస్తే ఖ‌చ్చితంగా హిట్ అవుద్ది. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్‌లో నాకు ఎంతో సహకరిస్తున్న బి.ఎ.రాజు గారికి ధన్యవాదాలు'' అన్నారు.

హీరోయిన్‌ హీరోయిన్‌ ఈషాన్యా మహేశ్వరి మాట్లాడుతూ - ''నమస్తే నేస్తమా' ఒక బ్యూటిఫుల్‌ ప్రాజెక్ట్‌. ఇది ఒక డాగ్‌ సెంట్రిక్‌ మూవీ అయినప్పటికీ ఈ సినిమాలో డ్రామా, ఎమోషన్‌, రొమాన్స్‌ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఉంటాయి. బొకాడియా గారు వెరీ టాలెంటెడ్‌ ఫిలిం మేకర్‌. ఎంతో మంది స్టార్‌ హీరోలను, హీరోయిన్లను ఇంట్రడ్యూస్‌ చేసిన బొకాడియా గారి సినిమాలో నటించడం నిజంగా నా అదృష్టం'' అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: