యంగ్ రెబెల్ స్టార్
ప్రభాస్ బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించాడు. దానితో అతనికి చాలా పెద్ద సినీ అవకాశాలు వచ్చాయి. అందులో
సాహో ఒకటి కావడం ప్రభాస్... ఆ ఆఫర్ ని
ప్రభాస్ ఒప్పుకొని షూటింగ్ చేయడం... చక చక జరిగిపోయాయి. కానీ భారీ బడ్జెట్.. ఇంకా భారీ అంచనాలతో తెరపైకి వచ్చిన ఈ
సాహో సినిమా చిన్నపాటి విజయం కూడా సాధించలేకపోయింది. ఆ సినిమాలోని గ్రాఫిక్స్..
శ్రద్ధ కపూర్ తో
ప్రభాస్ వేసిన స్టెప్పులు కొంతమేరకు అలరించినా అతని అభిమానులకు మాత్రం నిరాశనే కలిగించింది.
అయితే ఇప్పుడు
ప్రభాస్ తన అభిమానులని అతని నెక్స్ట్ సినిమాతో ఫుల్ల్ గా ఎంటర్టైన్ చేయాలనే ఆలోచనలలో ఉన్నడంట. అందుకే తన తదుపరి
సినిమా 'జాన్' పై పూర్తి ఏకాగ్రత పెట్టాడు. నిజానికి గత ఏడాదిలోనే ఈ
సినిమా ప్రారంభ వేడుకులని
హైదరాబాద్ లో నిర్వహించి... షూటింగ్ ని 2018
డిసెంబర్ లో ప్రారంభించాలని అనుకున్నారు ఈ చిత్ర బృందం. కానీ
ప్రభాస్ సాహో చిత్ర షూటింగ్ అని.. తర్వాత ప్రొమోషన్స్ అని ఇటీవల కాలం వరకు అతను బిజీగా ఉండడంతో ఈ
సినిమా షూటింగ్ వాయిదా పడింది.
ప్రస్తుతం ఫ్రీ అయిన
ప్రభాస్ తన నెక్స్ట్
సినిమా అయినా
జాన్ సెట్స్ లోకి తొందర్లోనే అడుగు పెడుతున్నట్లు సమాచారం. దీనితో
జాన్ రెగ్యులర్ షూటింగ్
నవంబర్ 18న ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దాంతో ఈ సినిమాలో నటిస్తున్న
పూజా హెగ్డే తో
ప్రభాస్ రొమాన్స్ చేయడానికి సిద్దమవుతున్నాడని చెప్పుకోవచ్చు.
గతంలో ఈ చిత్ర దర్శకుడు రాధకృష్ణ
మీడియా తో మాట్లాడుతూ.. 'జాన్'
సినిమా 1970 కాలంలో సాగే ఓ మంచి
లవ్ స్టోరీ అని..
సినిమా షూటింగ్ మొత్తం
యూరోప్ లోనే చేయాలనుకుంటున్నాం అని.. రెగ్యులర్ షూటింగ్ను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పాడు. కానీ ఇప్పుడు.... ఇటలీలో షూటింగ్ అంటే భారీ వ్యయంతో కూడుకున్నది కాబట్టి అక్కడ షూట్ ఆపేసి
హైదరాబాద్ లో ని
అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభిస్తున్నట్లు సమాచారం. భారీబడ్జెట్ తో వచ్చిన
సాహో ప్లాప్ అవ్వడంతో సాధ్యమైనంత తక్కువ బడ్జెట్ తో
జాన్ షూటింగ్ ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారంట క్రిష్.