టాలీవుడ్ లోకి బాలనటుడిగా రంగ ప్రవేశం చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెం.1’ మూవీలో నటించాడు.  ఈ మూవీ మంచి హిట్ అయ్యింది..తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ఆది సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  తర్వాత రాజమౌళి దర్శకత్వంలోనే సింహాద్రి, యమదొంగ సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు ఎన్టీఆర్.   ఆ మద్య ఒకటీ రెండు సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా..టెంపర్, జనతా గ్యారేజ్,జై లవకుశ ఇలా వరుసగా విజయాలు అందుకుంటూ వస్తున్నాడు. 

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నాడు ఎన్టీఆర్.  ఈ మద్య స్టార్ హీరోలు బిజినెస్ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.  మరికొంత మంది హీరోలు నిర్మాణ రంగం వైపు మళ్లారు. ఇప్పటికే మహేష్ ఎంబీ క్రియేషన్స్ అని ఓ ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం అనే సినిమాలను నిర్మించాడు. ప్రస్తుతం సరిలేరు నికేవ్వరు అనే సినిమాకి వన్ అఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉన్నాడు మహేష్.  ఇక ఖైదీ నెంబర్ 150 మూవీ నుంచి రామ్ చరణ్ సైతం నిర్మాణ రంగం వైపు దృష్టి పెట్టారు.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి చిరంజీవి హీరోగా ఖైది నెంబర్ 150, సైరా లాంటి చిత్రాలని నిర్మించాడు. ప్రస్తుతం చిరంజీవి 152 వ సినిమాని కూడా నిర్మిస్తున్నాడు. అంతే కాదు విజయ్ దేవరకొండ, నాని, కళ్యాణ్ రామ్, బాలకృష్ణ సినిమాలకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇప్పుడు ఇదే బాటలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సైతం  ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసి సినిమాలని నిర్మించే ప్లాన్ లో తారక్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ నిర్మాతగా మారి ఎలాంటి హిట్ మూవీస్ అందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: