బిగ్ బాస్ సీజన్ 3 నుండి ప్రతివారం ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరితో బిగ్ బాస్ బజ్ అంటూ తనీష్ చేత ఇంటర్వ్యూ చేయించారు. అయితే సీజన్ 3 ఫైనలిస్టులతో మాత్రం ఇంటర్వ్యూస్ నిర్వహించలేదు. బిగ్ బాస్ టాప్ 2లో శ్రీముఖి, రాహుల్ ఉన్నారు. రాహుల్ టైటిల్ గెలవగా శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది.


అయితే కేవలం టైటిల్ మాత్రమే గెలవలేదు కాని బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది శ్రీముఖి. ఇదిలాఉంటే బిగ్ బాస్ నుండి బయటకు రాగానే వెంటనే షోలు చేయకుండా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తుంది శ్రీముఖి. అక్కడ నుండే తన పిక్స్ షేర్ చేస్తూ అలరిస్తుంది. ఇక శనివారం తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో లైవ్ చాట్ లో పాల్గొంది శ్రీముఖి. 


నన్ను సంప్రదాయ దుస్తుల్లో.. మోడ్రెన్ దుస్తుల్లో.. అన్ని రకాలుగా చూశారు. మీ ఇంట్లో అమ్మాయిలా నన్న్య్ ట్రీట్ చేసినందుకు థ్యాంక్స్. ఇక మీదట మీరు గర్వపడే షోలే చేస్తాను.. మీ తక్కువగా అనిపించే షోలు చేయనని చెప్పింది శ్రీముఖి. శ్రీముఖి చెప్పిన మాటలను బట్టి చూస్తే తిరిగి పటాస్ షోని చేసే ఆలోచన లేదన్నట్టు తెలుస్తుది.


యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్న శ్రీముఖి ఇక మీదట మరింత క్రేజీ షోలు చేస్తుందట. ఇక బిగ్ బాస్ లో తన దృష్టిలో అసలు విన్నర్ బాబా భాస్కర్ అని.. ఆయన ఇంట్లో వండి పెట్టారు.. అందరిని ఎంటర్టైన్ చేశారు.. అందరిని జాగ్రత్తగా చూసుకున్నారు. టాస్కుల్లో కూడా ఫుల్ ఎనర్జీగా ఆడారు అందుకే బాబా భాస్కరే తన దృష్టిలో విన్నర్ అని చెప్పుకొచ్చింది శ్రీముఖి. అంటే రాహుల్ విజేతగా ప్రకటించిన శ్రీముఖికి అది నచ్చలేదని ఇన్ డైరెక్ట్ గా చెబుతుందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: