టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్ విజయశాంతిసినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తుండగా మహేష్ ప్రక్కన రష్మిక మందన్న తొలిసారి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మూడొంతులు పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ కేరళలో జరుగుతోంది. ఇకపోతే దీని తరువాత మహేష్ బాబు మూడు నెలల పాటు విరామం తీసుకోనున్నట్లు ఆయన సతీమణి నమ్రత ఇటీవల మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో మహేష్ బాబు పలువురు దర్శకుల నుండి కథలు వినడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారట. అయితే మహేష్ కోసం ఇప్పటికే త్రివిక్ర్రమ్ శ్రీనివాస్ ఒక పవర్ఫుల్ ఎంటర్టైనింగ్ స్టోరీని రెడీ చేసినట్లు టాక్. 

నిజానికి ఇటీవల ఒక యాడ్ సందర్భంగా కలిసిన త్రివిక్రమ్ మరియు మహేష్, తమ కాంబినేషన్లో తదుపరి సినిమాపై చర్చలు జరిపారని అంటున్నారు. అయితే అదే సమయంలో ఒక అద్భుతమైన స్టోరీ లైన్ ని మహేష్ కి వినిపించారట త్రివిక్రమ్. అది ఎంతో నచ్చిన మహేష్, దానిని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేస్తే వెంటనే షూటింగ్ మొదలెడదాం అని చెప్పారట. కాగా సరిలేరు తరువాత ఎలాగూ తనకు మూడు నెలలు ఖాళీ ఉంటుందని, ఈలోపు త్రివిక్ర్రమ్ అలవైకుంఠపురములో సినిమా ఫినిష్ చేసి, తమ సినిమా స్క్రిప్ట్ కనుక సిద్ధం చేస్తే హ్యాపీగా మే నెలలో ఆ సినిమాను పట్టాలెక్కించేలా ప్లాన్ చేశారట మహేష్. అయితే త్రివిక్రమ్ తదుపరి సినిమా మహేష్ తోనే అని ఇప్పటికే ఆయన వికీపీడియాలో అనౌన్సమెంట్ రావడంతో, ముచ్చటగా మూడవసారి వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా ఎలా ఉండనుందో అని అప్పుడే సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, 

ఈసారి త్రివిక్రమ్, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ని మహేష్ కోసం సిద్ధం చేసారని, అలానే ఆద్యంతం సినిమా మొత్తం కూడా మంచి ఎంటర్టైనింగ్ గా పంచ్ డైలాగ్స్ తో అదిరిపోతుందని, దానితో పాటు ఫ్యాన్స్ ఆశించే  యాక్షన్ సీన్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయని, కాబట్టి ఈసారి వీరిద్దరి కాంబినేషన్ రఫ్ఫాడించడం ఖాయమని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది మంచి పండుగ వార్తే అని చెప్పాలి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: