తెలుగు, తమిళ్లో నటిస్తూ బిజీగా ఉన్న
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం నటించిన
సినిమా దర్బార్.. ఈ సినిమాకు లెజండరీ దర్శకుడు ఏ ఆర్ ముగుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రజిని సరసన
నయనతార నటించింది. షూటింగ్ పనులు పూర్తిచేసుకున్న ఈ
సినిమా ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ
సినిమా రిలీజ్ కాబోతుంది. ఏది ఏమైనా ఆకూడా రజిని రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెంచడంతో సినీ యూనిట్ షాక్ లో ఉంది.
ఇది ఇలా ఉండగా
సినిమా మొత్తానికి అయినా బడ్జెట్
కన్నా ఎక్కువగా రజిని రెమ్యునరేషన్ ఉందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత సినిమాలతో పొలిస్తే ఈ సినిమాకు రజీని సినిమాకు డబల్ రెమ్యునరేషన్ ఈ సినిమాకు తీసుకోనున్నాడట. గతంలో ఒక్కో సినిమాకు 50 కోట్లు తీసుకుంటే ఈ సినిమాకు మాత్రం వంద కోట్లు డిమాండ్ చేస్తున్నారని
కోలీవుడ్ టాక్.మరీ పెంచాడనే వార్తలు జోరుగా వినపడుతున్నాయి.
నిజానికి సినిమాకు పెట్టిన మొత్తం బడ్జెట్ 200 కోట్లు, అందులో రజినీకి 100 కోట్లు కావడం విశేషం. ఎటు చూసికున్న మార్కెట్లో రజిని కున్న డిమాండ్ కారణంగా నిర్మాతలు ఆయన ఆయన అడిగినంత అమౌంట్ ఇవ్వడానికి సిద్దపడుతున్నారు .
సినిమా పై భారీగా అంచనాలు ఉండటంతో
సినిమా హిట్ పక్కా అని సదరు సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
విదేశీ
సినిమా మార్కెట్ లో రజినీకి డిమాండ్ బాగా ఉండటంతో అయన సినిమాలు అక్కడ కూడా హిట్ అవుతాయనే వార్తలు కూడా జోరుగా వినపడుతున్నాయి. రజిని స్టైల్ వేరనుకోండి.
సినిమా సినిమా కు ఇలా పెంచుకుంటూ పోతే ఇంకా రజినీతో సినిమాలు చెయ్యాలంటే కొత్త దర్శకులకు వణుకుపుడుతుందేమో అని జనాలు అభిప్రాపడుతున్నారు.