మూడు వ‌రుస ప్లాపుల త‌ర్వాత అక్కినేని హీరో త‌న దండ‌యాత్ర కొన‌సాగిస్తున్నారు. అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 ఈ సినిమాను నిర్మిస్తోంది. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌. ఇక 2020లో ఈ సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక అటు నితిన్ ప్ర‌స్తుతం ఛ‌లో ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో భీష్మ సినిమాలో నటిస్తున్నాడు.


సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను వ‌చ్చే ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల క‌థ విష‌యంలో ఓ షాకింగ్ న్యూస్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఈ రెండు సినిమాల మెయిన్ లైన్ ఒక్క‌టే అని తెలుస్తోంది. ముందుగా హీరో హీరోయిన్ ప్రేమ‌ను గెలుచుకుంటాడు... ఆ త‌ర్వాత వాళ్ల తల్లిదండ్రులు హీరోతో ప్రేమ‌ను అంగీక‌రించ‌రు. చివ‌ర‌కు హీరోయిన్ ఫ్యామిలీని ఇంప్రెస్ చేసేందుకు హీరో నానా పాట్లో లేదా అష్ట‌క‌ష్టాలో ప‌డి వాళ్ల‌ను ఒప్పించి... మెప్పించి ఈ ప్రేమ‌ను గెలుచుకుంటాడు. రెండు సినిమాల్లోనూ మెయిన్ లైన్ ఇదేన‌ట‌.


అఖిల్ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే కాబోయే మామ‌గారు హీరోను అపార్థం చేసుకుంటే చివ‌ర‌కు స‌క్సెస్ అయ్యి మామ‌గారితో శ‌భాష్ అనిపించుకుని హీరోయిన్‌ను పెళ్లాడ‌తాడ‌ట‌. ఇక నితిన్ సినిమాలో ఆవారాగా తిరిగే నితిన్ హీరోయిన్‌ను ప్రేమించినా ఆమె ఇంట్లో వాళ్లు ఒప్పుకోరు. ఇక ఓ కంపెనీ పెట్టి స‌క్సెస్ అయ్యాక వాళ్ల‌ను ఒప్పించి ఆమెను పెళ్లాడ‌తాడ‌ట‌. మ‌రి క‌థ ఒకేలా ఉన్నా ఇద్ద‌రు ద‌ర్శ‌కుల ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ?  చూడాలి.


ఏ సినిమాలో అయినా ప్రేమ‌లే, అపార్థాలు.. అప్యాయ‌త‌లు.. చివ‌ర‌కు అంద‌రూ ఒక్క‌టి అవ్వ‌డాలు కామ‌న్‌గానే ఉంటాయి. అయితే ద‌ర్శ‌కులు ఈ సినిమాను ఇంట్ర‌స్టింగ్‌గా తెర‌కెక్కించ‌డంలోనే సినిమా  జ‌యాప‌జ‌యాలు ఆధార‌ప‌డి ఉంటాయి. మ‌రి వెంకీ కుడుముల‌, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఈ సినిమాను ఎలా తెర‌కెక్కించారో ?  అవి రిలీజ్ అయితే కాని తెలియ‌దు.



మరింత సమాచారం తెలుసుకోండి: