ఆదివారం నాడు గల్ల జయదేవ్ తనయుడు
గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తూ శ్రీరాం
ఆదిత్య డైరక్షన్ లో ఓ
సినిమా మొదలైన విషయం తెలిసిందే. గల్ల జయదేవ్ ఈ
సినిమా నిర్మిస్తున్నారు.
మహేష్ మేనళ్లుడిగా
గల్లా అశోక్ ఇదివరకే లాంచింగ్ ఏర్పాట్లు జరిగాయి. దిల్ రాజు బ్యానర్ లో
అశోక్ డెబ్యూ
మూవీ చేయాల్సి ఉంది.
అశోక్ యాక్టింగ్ స్కిల్స్ చూసిన దిల్ రాజు అసంతృప్తి చెందడం వల్ల
సినిమా క్యాన్సిల్ అయ్యింది.
దిల్ రాజు ఎగ్జిట్ అయిన తర్వాత
గల్లా అశోక్ ప్రెస్టిజియస్ గా తీసుకుని హోం వర్క్ చేసి మరి సినిమాకు సిద్ధమయ్యాడని తెలుస్తుంది. ఈ
సినిమా ప్రొడక్షన్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవకుండా ఖర్చు పెట్టాలని
నిర్మాత జయదేవ్ ఫిక్స్ అయ్యాడట. శ్రీరాం
ఆదిత్య మీదే పూర్తి బాధ్యత ఉంచినట్టు తెలుస్తుంది. అందుకే
కోటి పాతిక లక్షలు ఇచ్చి మరి
హీరోయిన్ గా
నిధి అగర్వాల్ ను తీసుకున్నారు.