ఆదివారం నాడు గల్ల జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తూ శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో ఓ సినిమా మొదలైన విషయం తెలిసిందే. గల్ల జయదేవ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. మహేష్ మేనళ్లుడిగా గల్లా అశోక్ ఇదివరకే లాంచింగ్ ఏర్పాట్లు జరిగాయి. దిల్ రాజు బ్యానర్ లో అశోక్ డెబ్యూ మూవీ చేయాల్సి ఉంది. అశోక్ యాక్టింగ్ స్కిల్స్ చూసిన దిల్ రాజు అసంతృప్తి చెందడం వల్ల సినిమా క్యాన్సిల్ అయ్యింది.


దిల్ రాజు సినిమా కూడా శ్రీరాం ఆదిత్యనే డైరెక్ట్ చేయాలని అనుకున్నాడు. అయితే ఇప్పుడు అదే దర్శకుడితే గల్ల జయదేవ్ నిర్మాతగా ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో గల్లా అశోక్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ముహుర్త కార్యక్రమానికి రాం చరణ్, రానా గెస్టులుగా వచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదగా స్క్రిప్ట్ అందుకున్నాడు దర్శకుడు శ్రీరాం ఆదిత్య.


దిల్ రాజు ఎగ్జిట్ అయిన తర్వాత గల్లా అశోక్ ప్రెస్టిజియస్ గా తీసుకుని హోం వర్క్ చేసి మరి సినిమాకు సిద్ధమయ్యాడని తెలుస్తుంది. ఈ సినిమా ప్రొడక్షన్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవకుండా ఖర్చు పెట్టాలని నిర్మాత జయదేవ్ ఫిక్స్ అయ్యాడట. శ్రీరాం ఆదిత్య మీదే పూర్తి బాధ్యత ఉంచినట్టు తెలుస్తుంది. అందుకే కోటి పాతిక లక్షలు ఇచ్చి మరి హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను తీసుకున్నారు.


దేవదాస్ సినిమా తర్వాత శ్రీరాం ఆదిత్యసినిమా చేస్తున్నాడు. అతని డైరక్షన్ లో సినిమాలు బాగుంటున్నా సూపర్ హిట్ అనిపించుకోవడంలో వెనుకపడుతున్నాయి. మరి గల్లా అశోక్ లాంటి డెబ్యూ హీరోతో అయినా శ్రీరాం ఆదిత్య హిట్టు కొడతాడేమో చూడాలి. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: