తెలుగులో ఇప్పటి వరకు ఎంతో మంది బాలీవుడ్ భామలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో కొద్ది మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. విచిత్రం ఏంటంటే తెలుగు లో మంచి విజయాలు సాధించి మంచి పొజీషన్లో ఉన్న హీరోయిన్లు బాలీవుడ్ లోకి జంప్ అవుతున్నారు.  ఇక తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది రాశీఖన్నా.  అయితే 2013లో విడుదలైన హిందీ మూవీ"మద్రాస్ కెఫె"లో భారత ఇంటలిజెంస్ అధికారి విక్రం సింగ్ భార్య రూబి సింగ్ పాత్ర ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది.

ఇటీవల టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం లో నటించింది. బాబీ దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య నటిస్తున్న ‘వెంకిమామ’ సినిమాలో నటించింది.  ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ మూవీలో నటిస్తుంది. ఇందులో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్, ఇజాబెల్లా లెయితే  హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కేయస్‌ రామారావు సమర్పణలో కె.ఎ వల్లభ నిర్మిస్తున్నారు.

ఇప్పటి వరకు  సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, వరుణ్ తేజ్, నితిన్ లతో కలిసి నటించింది. ప్రస్తుతం తెలుగులో మంచి విజయాలు అందుకుంటున్న హీరోయిన్లు కోలీవుడ్ లో నటిస్తూ అక్కడ కూడా తమ సత్తా చాటుతున్నారు. అయితే రాశీఖన్నా కు మాత్రం తమిళనాట మంచి అవకాశాలు రాలేదు. తాజాగా ఈ అమ్మడు ఎదురు చూస్తున్న అవకాశం రానే వచ్చిందట..దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నటుగా సమాచారం. 

సినిమా కనుక విజయం సాధిస్తే రాశి తమిళంలో టాప్ పొజిషన్ కు చేరుకుంటుంది.  అప్పట్లో బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం నాజూగ్గా మారింది. కొంత కాలంగా పంజాబ్ కు హైదరాబాద్ కు చక్కర్లు కొడుతున్న రాశి, ఇప్పుడు హైదరాబాద్ కు తన మకాం ను మార్చింది.   మరి రాశీఖన్నాకు తమిళంలో విజయ్ తో నటించే సినిమా హిట్ అయితే..అక్కడ తన సత్తా చాటుతానంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: