సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ శర వేగంగా పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 80% పైనే షూటింగ్ పూర్తయింది. ఇక ఈ సినిమా రిలీజ్ కు కేవలం రెండు నెలలు మాత్రమే ఉంది. దీంతో సమాతరంగా పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్ని స్పీడ్ గా కంప్లీట్ చేస్తున్నారని తెలుస్తోంది. అనీల్ రావిపూడి టీం ఇప్పటి వరకూ ఎక్కడా బ్రేకులు లేకుండా షూటింగ్ చేశారు. అయితే మహేష్- విజయశాంతి జోడీ పై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్న ఫోటోలు ఇటీవల అంతర్జాలం లో లీకవ్వడం టీమ్ ని షాకయ్యోలా చేసింది.

అయితే ఈ సినిమా పబ్లిసిటీ స్టంట్ పై మహేష్ ఫ్యాన్స్ అంత సంతృప్తి గా లేరని సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఓ వైపు బన్ని సామ జవరగమన, రాములో రాముల లాంటి చార్ట్ బస్టర్స్ తో దూసుకు పోతుంటే.. ఇంత వరకూ సరిలేరు నుంచి చిన్న సాంగ్ బిట్ కూడా రాలేదని కంగారు పడుతున్నారు. అయితే ఈ లోగానే సరిలేరులో మ్యూజిక్ పరంగా స్టఫ్ ఏ మాత్రం తగ్గకుండా అనీల్ రావిపూడి ఎంతో జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తోంది. ఇందు లో ఒకటి కాదు రెండు పెప్సీ స్పెషల్ నంబర్స్ ఉండేలా అనిల్ చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ విషయంలో దేవీ ని బాగా ఒత్తడి పెడుతున్నాడని చెప్పుకుంటున్నారు. 

తాజాగా అందిన సమాచారం ప్రకారం ట్రైలర్ ట్రీట్ కోసం అనీల్ రావిపూడి ఇప్పటి నుంచే ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారట. ఇక ఈ ట్రైలర్ కొత్త సంవత్సరం కానుక గా జనవరి 1న రిలీజ్ చేయాలని అనిల్ ప్లానట. జనవరి 1 న సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ రిలీజ్ అవుతుంది. సరిగ్గా రిలీజ్ కి 10 రోజుల ముందు ట్రైలర్ రావడం కలిసొస్తుందని భావిస్తున్నారట. వాస్తవానికి నెల రోజుల ముందే పెద్ద సినిమాల ట్రైలర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రీరిలీజ్ లేదా ఆడియో లో ట్రైలర్ వదిలేస్తారు. కానీ మహేష్ టీమ్ ప్లాన్ చూస్తుంటే డిఫ్రెంట్ గానే కనిపిస్తోంది. అంతే కాదు దీన్ని బట్టి చూస్తుంటే ట్రైలర్ రావడం బాగా ఆలస్యం అవుతుందనే అర్థమవుతోంది. అయితే లేట్ గా వచ్చినా లేటెస్టుగా రావాలన్న ఆలోచనని తెలుస్తోంది. మహేష్ ఫ్యాన్స్ కి డబుల్ కిక్ ఇవ్వడమే లక్ష్యంగా  ఇలా ప్లాన్ చేస్తున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: