మహేష్ బాబు టైం ప్రస్తుతం మంచి సక్సెస్ ట్రాక్ పై నడుస్తుంది. 'స్పైడర్' సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో వెంటనే తనకి గతంలో 'శ్రీమంతుడు' లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వం లో 'భరత్ అనే నేను' సినిమా చేసి అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మహేష్ తర్వాత వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా అయినా 'మహర్షి' సినిమా తీసి మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో వరుసగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రెండు సూపర్ డూపర్ హిట్లు విజయాలు సాధించి అదే జోష్ తో అనిల్ రావిపూడి దర్శకత్వం లో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా స్టార్ట్ చేసి సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో మహేష్ ఉన్నారు.


ఇదిలా ఉండగా తాను కొత్త సినిమాలకు కమిట్ అయ్యే క్రమంలో తన ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తానని చెబుతూ ఫ్యాన్స్ కి తన కమిట్మెంట్ కి కనెక్ట్ అయ్యేటట్టు మహేష్ మాట్లాడుతుంటారు. అదే క్రమంలో సినిమా సక్సెస్ అయితే సక్సెస్ సంబరాలలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభిమానులను ఎంతగానో అలరిస్తారు. ముఖ్యంగా తన అభిమానులలో నచ్చేది సినిమా హిట్టయితే కచ్చితంగా చూస్తారు లేకపోతే ముందు మీరే చూడరు అంటూ అటువంటి అభిమానులు తనకు ఉన్నందుకు గర్వపడుతున్నాను అని చాలా సినిమా వేదికలపై చెప్పిన మహేష్ బాబు...తాజాగా విడుదల కాబోతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాల అభిమానులకు డబుల్ ధమాకా ఇస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.


విషయంలోకి వెళితే సరిలేరు నీకెవ్వరు సినిమా అభిమానుల కోసం రెండు స్పెషల్ సాంగ్స్ ఉండేలా మహేష్...డైరెక్టర్ పై ఒత్తిడి తీసుకు వచ్చినట్లు...సమాచారం. దీంతో ఈ రెండు స్పెషల్ సాంగ్స్ లో ఒక దానికి తమన్నా స్టెప్పులు వేస్తుండగా మరో దానికి వేరొక హీరోయిన్ నీ తీసుకోవాలనే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం.  



మరింత సమాచారం తెలుసుకోండి: