బాలకృష్ణ బోయపాటి శ్రీనుల కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వుతూ ఉండటంతో జోష్ లో ఉన్న బాలయ్య అభిమానులకు ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు బయటకు వస్తున్న ఒక న్యూస్ షాకింగ్ గా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ చాల పవర్ ఫుల్ గా తయారుకావడంతో ఈమూవీ బడ్జెట్ విషయంలో కోతలు పెట్టవద్దని బోయపాటి ఈ మూవీ నిర్మాతలతో లేటెస్ట్ గా మళ్ళీ రాయబారాలు చేసినట్లు టాక్. 

మూవీ నిర్మాతలు మటుకు తాము ఈ సినిమాకు సంబంధించి అనుకున్న 50 కోట్లకు మించి ఒక్క రూపాయి కూడ పెట్టుబడి పెట్టమని అంతకు మించి సినిమా బడ్జెట్ పెరిగితే బోయపాటికి ఇచ్చే పారితోషికంలో కోత పెడతామని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. అదేవిధంగా బోయపాటి ఈ సినిమాకు సంబంధించి ఆశిస్తున్నట్లుగా 12 కోట్ల పారితోషికం ఇవ్వలేమని ఎట్టి పరిస్థితులలోను బోయపాటికి ఈ సినిమాకు సబంధించి పారితోషికంగా 8 కోట్లు మించి ఇవ్వలేము అంటూ ఈ మూవీ నిర్మాతలు స్పష్టమైన క్లారిటీ ఇచ్చినట్లు టాక్. 

దీనితో ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలతో తనకు ఏర్పడ్డ భేదాభిప్రాయాలను తొలగించడానికి బాలయ్యను ఈ మూవీ నిర్మాతలతో రాయబారాలు చేయవలసిందిగా బోయపాటి కోరినా బాలయ్య తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సినిమా కథనంలో దమ్ము లేకపోతే ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టినా జనం చూడరు అన్న విషయం ‘సాహో’ ‘సైరా’ సినిమాల రిజల్ట్ నుండి నేర్చుకోమని బాలయ్య బోయపాటికి రివర్స్ క్లాస్ పీకినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రారంభం కాకుండానే బోయపాటికి మరొక షాక్ తగిలినట్లు తెలుస్తోంది. బాలయ్య పక్కన ఈ మూవీలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రచిత రామ్ ను పెట్టాలి అని బోయపాటి చేసిన ప్రయత్నాలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురైనట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు బోయపాటి వ్యక్తిగతంగా బెంగుళూరు వెళ్లి రచితను కలిసి ఈ మూవీ కథను చెప్పడానికి ప్రయత్నిస్తే ఆమె కథ వినడానికి కూడ ఆసక్తి కనపరచకుండా తాను సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ గా నటించను అని స్పష్టంగా చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ బాలయ్య సినిమాకు హీరోయిన్ కష్టాలు మొదలయ్యాయి అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: