టాలీవుడ్ లో మెగా హీరోలకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  మెగాస్టార్ చిరంజీవి తర్వాత మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  అప్పట్లో చిరు రాజకీయాల్లోకి వెళ్లడం..పవన్ కళ్యాన్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించడం జరిగింది.  అయితే అన్నయ్య బాటలోనే నడిచిన పవన్ కళ్యాన్ ప్రస్తుతం రాజకీయాల్లో తన సత్తా చాటుతున్నారు.  ఇక పవన్ తర్వాత ఆ రేంజ్ లో అల్లు అర్జున్, రాంచరణ్ లు మాస్ ఇమేజ్ సంపాదించారు.  


పవన్‌ కల్యాణ్‌ కు జానపద గీతాలు చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. తన సినిమాల్లో ఏదో ఒకటి ఫోక్ సాంగ్ ఉండేలా చూస్తుంటారు.  ఆ పాటలు కూడా అదే స్థాయిలో హిట్ అవుతున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ లు సైతం ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఇప్పుడు తన సినిమాల్లో ఖచ్చితంగా ఒక ఫోక్ సాంగ్ ఉండేలా చూస్తున్నారు. అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ  అల వైకుంఠపురములో పాపులర్ శ్రీకాకుళ జానపద గీతాన్ని వాడుకుంటున్నారట.

ఆ పాటని తమన్‌ తనదైన స్టైల్ లో స్వరపరిచారని, ఓ ప్రత్యేకమైన సందర్భంలో ఈ పాట వస్తుందని తెలుస్తోంది. ఇదే జరిగితే ఇక ఫ్యాన్స్ కి పూనకాలే అని చెప్పొచ్చు. ఈ మూవీ సంక్రాంతి పండగ కానుకగా విడుదల చేస్తున్నారు.  సుశాంత్, నవదీప్, రావు రమేష్ , మురళీ శర్మ ముఖ్యపాత్రలో కనిపిస్తున్నారు.ఇక అలనాటి తార టబు ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.  ఇప్పటికే త్రివిక్రమ్  అల్లు అర్జున్ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మంచి హిట్ టాక్ గా నిలిచిన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: