మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు
రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్
మూవీ ఆర్ఆర్ఆర్. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో అత్యంత భారీ ఖర్చు మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను
డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై
డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే యాభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ
సినిమా తాజా షెడ్యూల్
హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలోని ప్రత్యేక సెట్ లో జరుగుతోంది. ఈ సినిమాలో అల్లువారి సీతారామరాజుగా నటిస్తున్న
రామ్ చరణ్ మరియు ఇతర తారాగణంపై కోర్టు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.
అయితే ఈ సన్నివేశాలు సినిమాలో ఎంతో కీలకమని టాక్ వినపడుతోంది. కాగా ఈ షెడ్యూల్ లో
రామ్ చరణ్ ఒక్కరే షూటింగ్ లో పాల్గొంటున్నారని,
ఎన్టీఆర్ కు కొద్దిరోజులు రెస్ట్ ఇచ్చినట్లు తెల్సుతోంది. ఎక్కువగా ఈ షెడ్యూల్ మొత్తం కూడా పగటి పూటే జరుగుతుందని, అందువల్ల సెట్టింగ్ దగ్గరకు వచ్చే విజిటర్స్ ని కూడా కొంత నిరోధించిందట
సినిమా యూనిట్.
సినిమా లీకుల బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే
సినిమా యూనిట్ ఈ విధంగా కట్టడి చేసిందట. ఇకపోతే జూనియర్
ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న ఈ సినిమాకు
ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా కేకే సెంథిల్
కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు.
రాజమౌళి తండ్రి వివిజయేంద్ర
ప్రసాద్ కథను సమకూరుస్తున్న ఈ సినిమాలో అలియాభట్, సముద్రఖని,
రాహుల్ రామకృష్ణ,
బాలీవుడ్ నటుడు
అజయ్ దేవగన్ తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ
సినిమా ద్వారా
రాజమౌళి ఖ్యాతి ఇంకెంత రేంజ్ లో పెరుగుతుందో చూడాలి...!!