మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ఆర్ఆర్ఆర్. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో అత్యంత భారీ ఖర్చు మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే యాభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలోని ప్రత్యేక సెట్ లో జరుగుతోంది. ఈ సినిమాలో అల్లువారి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ మరియు ఇతర తారాగణంపై కోర్టు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. 

అయితే ఈ సన్నివేశాలు సినిమాలో ఎంతో కీలకమని టాక్ వినపడుతోంది. కాగా ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ ఒక్కరే షూటింగ్ లో పాల్గొంటున్నారని, ఎన్టీఆర్ కు కొద్దిరోజులు రెస్ట్ ఇచ్చినట్లు తెల్సుతోంది. ఎక్కువగా ఈ షెడ్యూల్ మొత్తం కూడా పగటి పూటే జరుగుతుందని, అందువల్ల సెట్టింగ్ దగ్గరకు వచ్చే విజిటర్స్ ని కూడా కొంత నిరోధించిందట సినిమా యూనిట్. సినిమా లీకుల బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే సినిమా యూనిట్ ఈ విధంగా కట్టడి చేసిందట. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. 

రాజమౌళి తండ్రి వివిజయేంద్ర ప్రసాద్ కథను సమకూరుస్తున్న ఈ సినిమాలో అలియాభట్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ సినిమా ద్వారా రాజమౌళి ఖ్యాతి ఇంకెంత రేంజ్ లో పెరుగుతుందో చూడాలి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: