తెలుగు లో బాలీవుడ్ బ్యూటీలు ఎంతో మంది వస్తున్న విషయం తెలిసిందే.  బాలీవుడ్ లో బాలనటిగా పరిచయం అయిన హన్సిక తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘దేశముదురు ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.  ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత తెలుగు లో వరుసగా ఛాన్సులు వచ్చాయి. గ్లామర్ పాత్రలోనే కాదు తన నటనతో కూడా హన్సిక అందరి మనసు దోచింది.  తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. గత కొంత కాలంగా ఈ అమ్మడు హర్రర్ మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. 


తెలుగు లో ఈ మద్య హన్సికకు ఛాన్సులు తక్కువ అయ్యాయి.  అయితే కోలీవుడ్ లో మాత్రం వరుసగా ఛాన్సులు దక్కించుకుంటున్న హన్సిక తాజాగాఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాట చెప్పి అందరినీ అబ్బుర పరిచింది. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వెళుతున్న హన్సిక, తెలుగులో మాత్రం అడపా దడపా మాత్రమే నటిస్తోంది.  తాజా చిత్రంగా 'తెనాలి రామకృష్ణ బీఏబీ ఎల్' ఎల్లుండి ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ మూవీలో సందీప్ కిషన్ తో పాటు ఈ అమ్మడు కూడా కడుపుబ్బా నవ్వించబోతుందట.


తాజాగా "దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డిగారితో గతంలో 'దేనికైనా రెడీ' చేశాను. ఆయనతో కలిసి నేను చేస్తున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమాలో నా పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇంతవరకూ 50 చిత్రాలకి పైగా చేశాను.ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పింనా తనకు మాత్రం  పూర్తి స్థాయిలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో చేయాలని వుంది. అలాంటి పాత్ర కోసమే చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో హన్సిక ముచ్చట ఎప్పుడు తీరుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: