ప్రస్తుతం
టాలీవుడ్ స్టైలిష్ స్టార్
అల్లు అర్జున్,
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న
సినిమా 'అల వైకుంఠపురములో'. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన
జులాయి,
సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి
సక్సెస్ సాధించి ఉండడంతో, ఈ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. బన్నీ సరసన పూజ హెగ్డే
హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలోని రెండు సాంగ్స్ ఇప్పటికే
యూట్యూబ్ లో మంచి సందడి చేస్తూ యూత్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాక అందులో సామజవరగమనా సాంగ్, అత్యధిక లైక్స్ పొందిన తెలుగు సాంగ్ గా గొప్ప రికార్డుని కూడా సొంతం చేసుకుంది.
ఇకపోతే ఈ
సినిమా విషయమై నేడు ఒక షాకింగ్ వార్త పలు
టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఈ
సినిమా కూడా గతంలో బన్నీ,
త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన
సన్ ఆఫ్ సత్యమూర్తి మాదిరి
ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్నట్లు గట్టిగా వార్తలు వినపడుతున్నాయి. వాస్తవానికి ఈ వార్త ఇప్పటికే కొద్దిరోజుల నుండి ప్రచారం అవుతున్నప్పటికీ, ఈ
సినిమా నుండి రేపు 'ఓ మై
గాడ్ డాడీ' అనే సాంగ్ రిలీజ్ కాబోతుండడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తపై మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు మాత్రం ఇది కూడా
సన్ ఆఫ్ సత్యమూర్తి మాదిరిగా తప్పకుండా మంచి
సక్సెస్ సాదిస్తుందని అంటుంటే,
మరికొందరు మాత్రం ఈ
సినిమా ద్వారా మరొకసారి
తండ్రి సెంటిమెంట్ ని నమ్ముకున్న బన్నీ, సన్ ఆఫ్ సత్యమూర్తి మాదిరిగా మరొక
సక్సెస్ అందుకుంటాడో లేదో అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ తమ సోషల్
మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇటువంటి వార్తలు ఎన్ని ప్రచారం అవుతున్నప్పటికీ, చివరికి
సినిమా చూసేవరకు ఈ
సినిమా కథ, కథనాలు ఎలా ఉంటాయి అనేవి చెప్పలేమని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఈ
సినిమా బన్నీకి ఎంత మేర
సక్సెస్ అందిస్తుందో చూడాలి....!!