ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ త్రివిక్రమ్ దర్శకత్వంలో, సంక్రాంతి కానుకగా వస్తోన్న ఈ సినిమాకు వీలైనంత ఎక్కువ ప్రచారం కల్పించాలని చిత్రయూనిట్‌తో పాటుగా బన్నీ చూస్తున్నారు.ఇప్పటి వరకు దీనిలో భాగంగానే రెండు పాటలను కూడా విడుదల చేశారు. అందులో ‘సామజవరగమన’ క్లాస్‌సాంగ్ గా,‘రాములో రాముల’ సాంగ్ మాస్‌ బీట్‌గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.


ముఖ్యంగా ‘సామజవరగమన’ ఆడియన్స్‌కు ఎంతలా కనెక్ట్ అయిపోయిందో అందరికి తెలిసిన విషయమే.. ఇకపోతే ప్రస్తుతం మూడో పాటను బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న ‘ఓఎంజీ డాడీ’ అంటూ సాగే పాట టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించారు. ఈ విషయాన్ని బుధవారం సాయంత్రం 4.05 గంటలకు ప్రకటించాలని ప్లాన్ చేశారు. అయితే, సాయంత్రం రావాల్సిన అనౌన్స్‌మెంట్ ముందుగానే వచ్చేసింది.


దీనికి కారణం అల్లు అర్జున్ అని అనుకుంటున్నారు. కానీ ఆయనే తొందరపడ్డారో, లేక ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాండిల్ చేస్తోన్న వ్యక్తి అత్యుత్సాహమో తెలీదు మొత్తానికి నవంబర్ 14న ‘ఓఎంజీ డాడీ’ సాంగ్ టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు బుధవారం  ఉదయం ట్వీట్ చేశారు.  మరో ట్విస్ట్ ఏంటంటే ఈ ట్వీట్ చేసిన కాసేపటికే డిలీట్ కూడా చేసేశారు. కానీ, అప్పటికే జరగవలసింది జరిగింది.చాలా మంది స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నారు.


ఇప్పుడు ఈ విషయం ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది... ఇకపోతే చిల్ట్రన్స్ డే సందర్భంగా ‘ఓఎంజీ డాడీ’ సాంగ్ టీజర్ వస్తోందన్న విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఉదయం 10 గంటలకు ‘ఓఎంజీ డాడీ’ సాంగ్ టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు..



మరింత సమాచారం తెలుసుకోండి: