టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న నటుడు డాక్టర్ రాజశేఖర్.  విలన్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోగా మారిన ఆయన తన సహనటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ రాజశేఖర్ మీడియా ముందుకు వస్తే ఏదోఒక కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తారని ఫిలిమ్ వర్గాల్లో టాక్.  ఆ మద్య మా అధ్యక్షుడు సీనియర్ నరేష్ ప్యానెల్ లో గెలిచినప్పటికీ ఆయనపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, డాక్టర్ రాజశేఖర్ మద్య విభేదాలు వచ్చాయని..తమపై దాడి కూచేయించారని అప్పట్లో సెన్సేషన్ సృష్టించారు. కానీ, స్వయంగా మెగాస్టార్..రాజశేఖర్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలవడం తో ఆ గోల సమసిపోయింది.

నిన్న ఔటర్ రింగ్ రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద ఆయన కారు మూడు పల్టీలు కొట్టింది. కారు బెలూన్స్ తెరుచుకోవడంతో రాజశేఖర్ కు ప్రాణపాయం తప్పింది. తనకు ఎలాంటి గాయాలు కాలేదని రాజశేఖర్ తెలిపారు. క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు. నిన్న రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద ప్రమాదం జరిగిందని రాజశేఖర్ చెప్పారు. తాజాగా రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. దేవుడి దయవల్ల పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని, చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని తెలిపారు. అయితే ప్రమాదంలో నుదుటిపై దెబ్బ తగలడంతో రక్తం కారిందని..అంతకు మించి పెద్ద గాయాలు ఏమీ కాలేదని అన్నారు.

సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు సంస్కారం మరిచిపోతున్నారని, చనిపోతే కనీసం చూడడానికి కూడా కొంతమంది వెళ్లడం లేదని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమయం వచ్చింది కనుక చెబుతున్నానని..తనను ఎవరూ అపార్థం చేసుకోవద్దని అన్నారు. మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోయినా దయచేసి చూడటానికి వెళ్లండి. లేదా కనీసం ఓ ట్వీట్ అయినా పోస్టు చేయండి.  నా క్షేమం కోసం దేవుడిని ప్రారించ వారికి నా నమస్కాం తెలియజేస్తున్నాని రాజశేఖర్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: