టాలీవుడ్ మెగా హీరో అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’ తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకొని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ దర్శకత్వంలో  ‘అలా వైకుంఠపురములో’  మూవీలో నటిస్తున్నారు. జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానున్న ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన రెండు లిరిక్స్ ‘సామజవర గమనా’, ‘రాములో రాముల’ యూట్యూబ్ లో సంచలన రికార్డులు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.  థ‌మ‌న్ స్వ‌ర‌ప‌ర‌చిన సాంగ్స్‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తూ మూవీపై భారీ హైప్స్ క్రియేట్ చేస్తున్నారు. 


ఈ రోజు బాల‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా మూవీ నుండి మూడో సాంగ్ విడుద‌ల చేశారు. ఈ మూవీ చిత్రీకరణపరంగా  ముగింపు దశకి చేరుకుంది.  తాజాగా  ‘అలా వైకుంఠపురములో’ నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు.  అయితే 3వ సాంగ్ కి ఎంతో ప్రత్యేకత క్రియేట్ చేశారు చిత్ర యూనిట్. ఈ రోజున 'చిల్డ్రన్స్ డే' కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, 'ఓమై గాడ్ డాడీ' అనే సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు. బన్నీ ఇద్దరి పిల్లకి సంబంధించిన వీడియోపై ఈ సాంగ్ బిట్ ను రన్ చేశారు. బన్నీ పిల్లలిద్దరూ ఈ సాంగ్ కి తమ వయసుకి తగిన స్థాయిలోనే అభినయించారు. 


అల్లు అర్జున్ కి తన పిల్లలు అల్లు అయాన్‌, అల్లు అర్హాలు  అంటే పంచ ప్రాణాలు.  వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని తన ఫ్యాన్స్ కి షేర్ చేస్తూ ఉప్పొంగిపోతుంటారు. తాజాగా  ‘అలా వైకుంఠపురములో’ మూడో సాంగ్ తన పిల్లల తోనే ప్రమోషన్ ఇప్పిస్తున్నారు. ఇక మ‌ల‌యాళ‌ములోను ఈ మూవీ విడుద‌ల కానుండ‌గా అంగు వైకుంఠ‌పుర‌త్తు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీలో సుశాంత్, నివేదా పెతురాజ్‌, ట‌బు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సంద‌డి చేయ‌నున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: