మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో, సరస్వతీ ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న ‘క్రాక్’ మూవీ ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రవితేజ, శృతి హాసన్, కె.రాఘవేంద్రరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, గోపిచంద్ మలినేని, సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్, దిల్ రాజు, సాయి మాధవ్ బుర్రా, ఠాగూర్ మధు తదితరులు పాల్గొన్నారు.


రవితేజ, శృతిహాసన్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సురేందర్ రెడ్డి, దిల్ రాజు దర్శకుడికి స్క్రిప్ట్ అందచేశారు. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ‘క్రాక్’ ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది.
మరోవైపు తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ప్రస్తుతం రవితేజ వీఐ. ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిస్కో రాజా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల కాకముందే రవితేజ మరో సినిమాను ఒప్పుకోవడంతో ఆయనెంత స్పీడు మీదున్నారో అర్ధమవుతుంది.


ఇది ఇలా ఉండగా డిస్కో రాజా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. తొలుత క్రిస్మస్ కు సినిమాను విడుదల చెయ్యాలి అనుకున్నా జనవరికి వాయిదా వేశారు. వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు.  కిక్ చిత్రంలో ఫుల్ కామెడీ పంచిన ర‌వితేజ క్రాక్ చిత్రంతో కేక‌పెట్టిస్తాడ‌ని అభిమానులు అంటున్నారు. థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు . శృతి హాస‌న్ కథానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ముఖ్య పాత్ర కోసం త‌మిళ స‌ముద్ర‌ఖ‌నిని ఎంపిక చేసింది చిత్ర బృందం.


సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో రెగ్యలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. 2020 వేసవిలో విడుదల చేయనున్నారు. డైలాగ్స్ : సాయి మాధవ్ బుర్రా, మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రఫీ : జీకే విష్ణు, ఎడిటింగ్ : నవీన్ నూలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: