సంక్రాంతి సినిమా సందడి అపుడే మొదలైపోయింది. రెండు పెద్ద తెలుగు సినిమాల మీదనే అందరి కన్నూ పడుతోంది. ఓ వైపు సూపర్ స్టార్ మహేష్ బాబు, మరో వైపు అల్లు అర్జున్ పోటా పోటీగా పోటీకి దిగిపోతున్నారు. 2020 సంక్రాంతి మాదంటే మాది అంటున్నారు. ఈ పోటీలో ఎవరు విజేత అన్నది చెప్పలేకపోయినా ఇప్పటివరకూ ప్రమోషన్లో కానీ, బిజినెస్ లో కానీ రెండు సినిమాల మధ్యన పోటీని గమనిస్తే బన్నీయే కాస్తా  ముందున్నట్లుగా తెలుస్తోంది.


సరిలేరు నీకెవ్వరు కంటే కూడా బన్నీ సినిమా అల వైకుంఠపురంలో మూవీ హిందీ రైట్స్ భారీగా పలకడం ఇపుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయింది. ఈ మూవీ రైట్స్ తీసుకుంటే ఏకంగా 19.5 కోట్లకు డీల్ కుదిరిందని అంటున్నారు. అదే సరిలేరు నీకెవ్వరు చూసుకుంటే 15 కోట్లకే డీల్ కుదింది. ఇక మహేష్ బాబు హిట్ల మీద హిట్లు కొట్టినా కూడా హిందీ రైట్స్ బిజినెస్ ఇలా ఉంటే బన్నీ రెండేళ్ళ క్రితం నా పేరు సూర్య మూవీతో భారీ ఫ్లాప్ తో ఉన్నా కూడ ఆయన కొత్త మూవీకి ఇంత రేంజిలో హిందీ రైట్స్ రావడం అంటే గొప్పేనని చెపాలంటున్నారు.


ఇక ఈ ఇద్దరు హీరోలు సైరాను మాత్రం బాగానే అధిగమించారు. దాదాపు  వందల కోట్లతో తీసిన సైరా హిందీ హక్కులు కేవలం 9 కోట్లకే అమ్మేశారు. దాని మీద మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మంచి బిజినెస్ చేస్తే ఇపుడు అల్లు అర్జున్ ఏకంగా డబుల్ బిజినెస్ చేశాడు. ఇక ప్రమోషన్లలో కూడా బన్నీ అపుడే స్పీడ్ అయ్యాడు. ఈ రోజు రిలీజ్ చేసిన డాడీ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి మహేష్ మీద బన్నీ ఓ విధంగా బిజినెస్ లో పై చేయి సాధించాడని అంటున్నారు. మరి మూవీ విడుదల తరువాత ఎవరు అసలైన విజేతలో చూడాలి.
 



మరింత సమాచారం తెలుసుకోండి: