ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ మరియు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ కేరళలో జరుగుతోంది. ఇకపోతే ఈ సినిమా నుండి తొలి సాంగ్ ని మరియు సినిమా అధికారిక ఫస్ట్ లుక్ టీజర్ ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తోంది సినిమా యూనిట్. లేడీ అమితాబ్ విజయశాంతి కొన్నేళ్ల తరువాత ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుండడంతో ప్రేక్షకులు ఈ సినిమా పై మరింత ఆసక్తి కనపరుస్తున్నారు. ఇక మహేష్ కూడా వరుసగా రెండు సక్సెస్ లు కొట్టడంతో పాటు, 

దర్శకుడు అనిల్ రావిపూడి కూడా కెరీర్ పరంగా తన సినిమాలన్నిటితో సూపర్ హిట్స్ అందుకోవడంతో తప్పకుండా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళి శర్మ నేడు ఒక మీడియా సమావేశంలో సినిమా గురించి మాట్లాడుతూ, వాస్తవానికి తనకు తెలుగులో తొలి అవకాశం మహేష్ గారు నటించిన అతిథి ద్వారా వచ్చిందని, ఆ సినిమా తరువాత మళ్ళి ఇన్నేళ్లకు మహేష్ గారి ప్రక్కన సరిలేరు నీకెవ్వరులో నటిస్తున్నానని అన్నారు. మహేష్ గారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషి అని, వ్యక్తిత్వంలో ఆయనకు ఆయనే సాటి అన్నారు. 

ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని, ఆయనకు ఆడియన్స్ కి ఎటువంటి సినిమా అందించాలి అనే దానిపై ఎంతో పట్టుందని, తప్పకుండా ఈ సినిమా రేపు రిలీజ్ తరువాత సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని మురళి శర్మ అన్నారు. కాగా మురళి శర్మ వీడియోని కాసేపటి క్రితం ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు. ఇక మురళి శర్మ వ్యాఖ్యలతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: