యువ హీరో రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటాడు. ఆ తర్వాత సుకుమార్ నిర్మాణంలో కుమారి 21ఎఫ్ అంటూ వచ్చి క్రేజీ హిట్ కొట్టాడు. ఆ సినిమా టైంలో రాజ్ తరుణ్ కెరియర్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఉంటే ఇప్పుడు అతని పరిస్థితి కచ్చితంగా ఇలా ఉండేది కాదు. 


ఈమధ్య వరుసగా ఐదు ఫ్లాపులు ఎదుర్కున్న రాజ్ తరుణ్ సినిమాలకు మార్కెట్ లో డిమాండ్ కూడా లేకుండా పోయింది. అయితే లేటెస్ట్ గా రాజ్ తరుణ్ లవ్ విషాదాంతం అయ్యిందని తెలుస్తుంది. ఈమధ్యనే తను లవ్ లో ఉన్నట్టుగా కన్ఫాం చేసిన రాజ్ తరుణ్ త్వరలోనే పెళ్లి అంటూ ఊరించాడు. అయితే అతని లవ్ స్టోరీ విషాదాంతం అయ్యింది సినిమాలోనే రియల్ లైఫ్ లో కాదు.   


ప్రస్తుతం రాజ్ తరుణ్ నటిస్తున్న ఇద్దరిలోకం ఒకటే సినిమా చేస్తున్నాడు. కృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరో లవ్ ఫెయిల్ అవుతాడట. అది తన త్యాగం వల్ల కాదట రివర్స్ లో హీరోయిన్ త్యాగం చేస్తుందని తెలుస్తుంది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు.


ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్ కు ట్రాజడీ ఎండింగ్ స్టోరీ ఇచ్చి హిట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు దిల్ రాజు. ఈ సినిమాతో అయినా రాజ్ తరుణ్ హిట్ ట్రాక్ ఎక్కేస్తాడో లేదో చూడాలి. సినిమాలో రాజ్ తరుణ్ సరసన షాలిని పాండే హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 25న సినిమా రిలీజ్ అని చెప్పినా ఇంతవరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. ఒకవేల సినిమా వాయిదా వేసే ఆలోచనతోనే దర్శక నిర్మాతలు సైలెంట్ గా ఉండి ఉంటారని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: