మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. కొత్తగా మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ కూడా విజేత సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఇప్పుడు ఆ హీరో రెండో సినిమాకు సిద్ధమవుతున్నాడు. సూపర్ మచ్చి అంటూ కళ్యాణ్ దేవ్ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. ఇక ఇదే క్రమంలో మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ షురూ అయ్యింది.


అతనే మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్. సాయి ధరం తేజ్ లానే ఇంతను కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరక్షన్ లో వైష్ణవ్ తేజ్ సినిమా చేస్తున్నాడు. ఉప్పేన టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారని తెలుస్తుంది.


అయితే ఈ సినిమాకు అప్పుడే 20 కోట్ల బడ్జెట్ దాటేసిందని తెలుస్తుంది. ఇంకా మరో 30 రోజులు షూటింగ్ ఉన్నా సరే 20 కోట్లు బడ్జెట్ దాటడంతో నిర్మాతలు ఢీలా పడ్డారని తెలుస్తుంది. సుకుమార్ సమర్పణలో సినిమా వస్తున్నా ఆయన డబ్బులేమి పెట్టలేదని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా విషయంలో చాలా నిరుత్సాహంలో ఉన్నారట.


సినిమాను త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే రిలీజ్ టైంలో పోటీగా ఏ సినిమా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే పెట్టిన బడ్జెట్ రాబట్టాలి అంటే కనీసం సోలోగా రిలీజ్ అయితే బెటర్ అనేది వారి ఆలోచన. ఏది ఏమైనా మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమానే ఇలా బడ్జెట్ కంట్రోల్ తప్పడంపై ఇండస్ట్రీలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మరి వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాపై ఈ ఎఫెక్ట్ ఏమేరకు పడుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: