అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో రష్మిక మందన మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. అంతేకాకుండా ఈ సినిమాలో మహేష్ బాబు మిలటరీ మేజర్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన విడుదలైన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ మరికొద్ది రోజుల్లో విడుదలవుతున్న నేపథ్యంలో టీజర్ లో  ఇవే హైలెట్స్ అంటూ సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.


గతంలో సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ ఇంట్రో టీజర్ తో పాటు పలు పోస్టర్లు సైతం సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇదిలా ఉండగా డిసెంబర్ నెల మొదటి వారంలో ఈ సినిమా అధికారిక ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు గత కొద్దిరోజలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ టీజర్ ఎలా ఉండబోతోంది అనే విషయాలు బయటకు కుప్పలుతెప్పలుగా ఇండస్ట్రీ నుండి వార్తలు వస్తున్నాయి.


దానిని బట్టి, టీజర్ మొత్తం రన్ టైం ఒక నిమిషం ఉంటుందని, అందులో మెయిన్ గా రెండు యాక్షన్ సీన్స్ తో పాటు రెండు ఎంటర్టైనింగ్ డైలాగులు కూడా ఉండబోతున్నట్లు టాక్. అంతేకాకుండా ఈ టీజర్లో విజయశాంతి మరియు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్ రష్మిక మందన కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా టీజర్ లో మహేష్ బాబు పలికే కామెడీ డైలాగ్స్ మరియు పంచులు అదరగొట్టే రీతిలో ఉండబోతున్న ట్లు ఫిలింనగర్ నుండి వినబడుతున్న టాక్. 



మరింత సమాచారం తెలుసుకోండి: